కోనసీమలో కరోనా
దేశ వ్యాప్తంగా క్రమంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టాయి. మరోవైపు దేశ రాజధాని ఢల్లీి సహా కేరళ, మహారాష్ట్ర, లతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కోవిడ్ కేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా మహమ్మారి..అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 47మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది.. పి.గన్నవరం సీహెచ్సీలో ఐదుగురికి కరోనా సోకింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇదే విషయంపై జిల్లా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణమే రోజు రోజుకు పెరుగుతున్న కేసులకు కారణం అని చెప్పారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 47 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.తాజాగా డి.గన్నవరం అఊఅ లో ఐదుగురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. అధికారులను అప్రమత్తం చేసింది. గత కొద్ది రోజులుగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు చెప్పారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 47 కోవిడ్ కేసులు నమోదయ్యాయని.. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. కరోనా నిర్ధారణ అయినా బాధితులు హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్కరుగా అందరూ కోలుకుంటున్నారని. పరిస్థితులు ఆందోళన కరంగా లేవని.. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యలుగా కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు దుర్గారావు.మరోవైపు కాకినాడలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి..ఇప్పటివరకూ కేసులే అనుకుంటే ఇప్పుడు మరణాలు సంభవించడం ఆందోళన కారణమైంది.. కాకినాడ జీజీహెచ్లో కొవిడ్తో ఇద్దరు మృతి చెందారు..న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరారు పేషెంట్లు..ఆ ఇద్దరికి కరోనా సోకడంతో జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు..
విచిత్రమైన వాతావరణం
వేసవి వచ్చేసింది. ఎండాకాలం ప్రారంభమైపోయింది. పలు ప్రాంతాల్లో ఎండల వేడికి జనం అల్లాడుతున్నారు. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే, మండుతున్న వేసవిలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఉదయాన్నే అక్కడ మంచు కమ్మేస్తోంది.. ఇదీ ఏమైనా శీతాకాలామా అనే డౌట్ కలిగిస్తోంది..? అక్కడున్న పరిస్థితులు చూస్తుంటే విూరే నమ్మరు.. సరిగ్గా ఉదయం పది దాటితే మాడుపగిలేలా ఎండ దంచికొడుతుంది.. అదే ఉదయాన్నే సూర్యుడు ఇంకా పొద్దు పొడవకముందే వచ్చే మంచు చూస్తుంటే అక్కడి ప్రాంత ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఎండలు దంచికోడుతున్న వేళ.. మంచు కురవడం ఏంటీ.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.శీతాకాలంలో మంచు కురవడం కామన్.. కానీ.. ఎండాకాలంలో మంచు ఏంటని ముమ్మిడివరం వాసులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో ఉదయం మంచు.. తర్వాత సూర్యుడు భగభగలు.. ఈ విచిత్ర వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు సూర్యుడి ప్రతాపం.. మరోవైపు ఉదయమే మంచు కమ్మేయడం వంటి పరిస్థితులు ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగు రోజులుగా చోటుచేసుకున వాతావరణ మార్పులతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు..ఇక కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడానికి వాతావరణ పరిస్థితులే కారణం అంటున్నారు వైద్య నిపుణులు..విచిత్ర వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.