వేదికపై దండలు మార్చుకుని.. ముద్దులు పెట్టుకుని..

తాజాగా ఓ ఇన్సిడెంట్‌తో మరోసారి ఈ జంట ట్రెండింగ్‌లో ఉన్నారు. ఓ వేదికపై ఈ జంట రొమాంటిక్‌ పాటకు స్టెప్పులు వేశారు. వేదికపై ఇద్దరూ పూల దండలు మార్చుకున్నారు. అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్నారు. దీనంతటికి ‘మళ్లీ పెళ్లి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా మారింది. దర్శకుడు ఎం. ఎస్‌. రాజు తెరకెక్కించిన ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పవిత్రా లోకేశ్‌ వేదికపై భావోద్వేగంగా మాట్లాడారు. మొదట నరేశ్‌, ఎమ్మెస్‌ రాజ్‌లకు కాళ్లకు నమస్కరించి స్పీచ్‌ మొదలుపెట్టారు. (Romantic Dance)

ఆమె మాట్లాడుతూ ‘‘ఇది దేవుడు ఇచ్చిన లైఫ్‌. ఎలా రాస్తే అలా బతికేస్తుంటాం. ఇప్పుడు నాకు ఆ అదృష్టం వచ్చింది. ఏ ఆడపిల్లకైనా జీవితంలో కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. అది చేయాలి.. ఇది చేయాలి.. అవి కొనాలి.. ఇంత సంపాదించాలి అని. ఆ కోరికలు నాక్కూడా ఉన్నాయి. ఆ డ్రీమ్స్‌ను ఫుల్‌ ఫిల్‌ చేయడానికి మా నాన్నగారు కూడా లేరు. నా చిన్నతనంలోనే ఆయన వెళ్లిపోయారు. దాంతో ఒంటరి పోరాటం చేశా. నాకంటూ ఓ స్పేస్‌ క్రియేట్‌ చేసుకుని కష్టపడి ఈ స్థాయికి వచ్చా. నా లైఫ్‌ని బిల్డ్‌ చేసుకున్నా. నా అనుమతి లేకుండా కొన్ని దుష్టశక్తులు దాన్ని బ్రేక్‌ చేశాయి. దానికి తగ్గట్టే నేనూ చేశా. ఇప్పుడు ఆ విషయాల్ని తలచుకుంటే ఏదోలా ఉంటుంది. ఇప్పుడు నన్ను కాపాడటానికి నా వెనుకు ఓ శక్తి ఉది. ఆ శక్తి నరేశ్‌. ఈ శక్తి గురించి ఆ దుష్టశక్తులకు తెలియదు. మళ్లీ ఎదిగేందుకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. నా కుటుంబంతోసహా కృష్ణగారు, మహేశ్‌బాబు అభిమానులంతా నన్ను అంగీకరించారు. నరేష్‌ లాంటి సంస్కారం ఉన్న వ్యక్తిని నాకు ఇచ్చినందుకు మహాతల్లి విజయనిర్మల గారికి థాంక్స్‌ చెప్పాలి’’ అని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *