మంత్రి పదవి వద్దన్న సంజయ్‌

హైదరాబాద్‌, జూలై 6
తెలంగాణలో మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్‌ఎస్‌తో బీజేపీ గట్టిగానే పోరాడుతోంది. తామే ప్రత్యామ్నాయం అనే స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించిన బండి సంజయ్‌ని తప్పించడంపై నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కొందరు నేతలు దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నా… సంజయ్‌కు అనుకూలంగా ఉన్న వారిలో మాత్రం ఆ హ్యాపినెస్‌ లేదు. అంతెందుకు పార్టీ మాటే శిరోధార్యం అన్న బండి సంజయ్‌లో కూడా అసహనం ఉందని తెలుస్తోంది. తెలంగాణ అధ్యక్షుడిగా తనను తప్పిస్తూ హైకమాండ్‌ తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ని రెండు రోజు క్రితమే ఢల్లీి పిలిపించిన అధినాయకత్వం పార్టీ అధ్యక్షుడిని మారుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రాబోతున్న వేళ మార్పు సరైందని కాదని ఆయన వాదించే ప్రయత్నం చేశారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కూడా సపోర్ట్‌ లభించింది. బండి సంజయ్‌ మాటలు కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విజ్ఞప్తులను కానీ బీజేపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. మార్పుపై నిర్ణయం తీసుకున్నామని… పార్టీని సక్సెస్‌ఫుల్‌గా నడిపిన బండి సంజయ్‌కు మంచి పదవి ఇస్తామన్నారు. కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు కూడా సంకేతాలు పంపించారు. అయితే ఎన్నికల మూడ్‌లో ఉన్న కేడర్‌ను పార్టీని డిస్టర్బ్‌ చేయడం మంచిది కాదని ఆయన చెప్పుకొచ్చారు. అయినా అధినాయకత్వం వినలేదని సమాచారం. అధ్యక్షుడిగా తనను తప్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్‌ అసంతృప్తిగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఆయన ఇంతవరకు విూడియా ముందుకు రాలేదు. ఢల్లీి వెళ్లి వచ్చినప్పుడు ఎక్కడా విూడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. తనకు ఆఫర్‌ చేసిన కేంద్రమంత్రి పదవిని కూడా కాదన్నారని తెలుస్తోంది. ఓ సామాన్య కార్యకర్తగానే ఉంటానని అధ్యక్షుడికి చెప్పినట్టు సమాచారం. కొత్త అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించిన విషయంపై ఏదో ముబావంగా స్పందించారు బండి సంజయ్‌. ట్విటర్‌ వేదిగా ఓ మేసేజ్‌ చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్న టైంలో సహకరించిన వారికి ధన్యవాదాలు చెబుతూనే… కిషన్‌ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తగా పని చేస్తానంటూ ముగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…’’నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అందించిన మద్దతు, ప్రేమ, ప్రోత్సాహానికి నాయకులు డ కార్యకర్తలు అన్ని మోర్చాల నాయకులు, సభ్యులకు, సంగ్రామ సేన, రాష్ట్ర పార్టీ కార్యాలయ ఉద్యోగులు, సోషల్‌ విూడియా యోధులు, ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ విూడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజాసంగ్రామయాత్రలో అడుగడుగునా నన్ను స్వాగతించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ రోజు నన్ను తీర్చిదిద్దిన కరీంనగర్‌ ఓటర్లకు డ కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.మన జీవితంలోని కొన్ని అధ్యాయాలు పూర్తి కాకుండానే ముగించాల్సి ఉంటుంది. నా పదవీకాలంలో నేను అనుకోకుండా ఎవరినైనా బాధపెట్టినట్లయితే మన్నించాలి. నేను విచారకరమైన కథను కానందుకు నేను సంతోషిస్తున్నాను. కానీ విూరందరూ నాకు మరపురాని క్షణాలను అందించారు. అరెస్టుల సమయంలో నాతో ఉండటం, దాడి జరిగినప్పుడు పక్కన నిలబడటం, కేసీఆర్‌ పాలనపై నేను చేసిన పోరాటంలో అరెస్టులు, దాడులు ఎదుర్కొన్నప్ప టైంలో అండగా నిలిచిన బీజేపీ కార్యకర్తలకు హ్యాట్సాఫ్‌. వర్షం కురిసినా, పిడుగులు పడినా విూరు నాతో ఉన్నారు, ఎందుకంటే నేను విూలో ఒకడిని, ఎల్లప్పుడూ అలానే ఉంటాను. కిషన్‌ రెడ్డి సమర్థ నాయకత్వంలో నేను కొత్త ఉత్సాహంతో పార్టీ కోసం పని చేయడానికి ఎదురుచూస్తున్నాను అని అందరికీ ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ఈ ఉదయం మరో ట్వీట్‌ చేస్తూ… రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక డఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు కిషన్‌ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అభినందనలు. అనుభవజ్ఞులైన, సమర్థులైన విూ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి విూరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను అని పోస్టు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *