టాప్‌ గేర్‌ లోకి గులాబీ

హైదరాబాద్‌, అక్టోబరు 10
తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీగా.. సొంత ఇమేజ్‌ని కాపాడుకుంటూ హ్యాట్రిక్‌ విక్టరీ కొట్టాలన్న టార్గెట్‌తో గులాబీపార్టీ దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలకంటే చాలాముందే ఏకకాలంలో అభ్యర్థులను ప్రకటించి సవాల్‌ విసిరింది బీఆర్‌ఎస్‌. సిట్టింగ్‌లలో కొందరిపై వ్యతిరేకత ఉన్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరిష్మాకు తోడు ప్రభుత్వ పథకాలతో ప్రజల మళ్లీ తమకే పట్టం కడతారన్న నమ్మకంతో ఆ పార్టీ ఉంది. విపక్షాలు బలం పుంజుకున్నచోట తనదైన వ్యూహంతో బీఆర్‌ఎస్‌ ముందుకెళ్తోంది. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డినుంచి పోటీకి కేసీఆర్‌ నిర్ణయించుకోవడం ఆ వ్యూహంలో భాగమే. 2019ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు కవిత. కేసీఆర్‌ కామారెడ్డిని ఎంచుకోవడానికి ఇది కూడా ఓ కారణం. తాను పోటీచేస్తే ఆ ప్రభావం కేవలం జిల్లావ్యాప్తంగా ఉంటుందని, చుట్టుపక్కల జిల్లాలపైనా దాని ఎఫెక్ట్‌ ఉంటుందన్నది బీఆర్‌ఎస్‌ అధినేత అంచనా. అందుకే మొదట్నించీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు తమకు కంచుకోటలా ఉన్న ఉత్తర తెలంగాణపై ఫోకస్‌ పెంచారు.అధినేతకు తోడుగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రి హరీష్‌రావు పర్యటనలతో పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ఇక అధినేత కూడా రంగంలోకి దిగుతున్నారు. సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది బీఆర్‌ఎస్‌. తాము అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత వచ్చిన మార్పుని ప్రజలు గమనించారంటోంది. అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్న కాంగ్రెస్‌, బీజేపీ ప్రజలకు ఏం చేశాయని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగడం, కాంగ్రెస్‌ హావిూలతో బీఆర్‌ఎస్‌ కూడా మరిన్ని ప్రజాకర్షక హావిూలు, పథకాలకు సిద్ధమవుతోంది. తన మేనిఫెస్టోతో విపక్షాల ఎత్తులను చిత్తు చేయాలనుకుంటోంది. రెండుసార్లు అధికారంలో ఉండటంతో సహజంగా ఉండే ప్రజావ్యతిరేకతతో నష్టం జరగకుండా చూసుకునే వ్యూహంతో ఆ పార్టీ ఉంది. ఎంఐఎం మద్దతుతో మైనారిటీ ఓటుబ్యాంక్‌ చేజారకుండా జాగ్రత్తపడే ప్రయత్నాల్లో ఉంది. కాంగ్రెస్‌, బీజేపీ రెంటినీ టార్గెట్‌ చేసుకుంటూ ప్రచారంలో స్పీడ్‌ పెంచారు బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు.ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవ్వడంతో.. సీఎం కేసీఆరే ఇక రంగంలోకి దిగనున్నారు. వరుస బహిరంగ సభలు.. ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ.. వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచిస్తూ.. విపక్ష పార్టీలకు సవాల్‌ విసరనున్నారు. ఇప్పటికే.. సీఎం కేసీఆర్‌ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ సైతం విడుదలయ్యింది. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఆ సభలను విజయవంతం చేసేందుకు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు.
సర్వేల్లో కాంగ్రెస్‌ ఎడ్జ్‌
తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇప్పటి వరకూ ఫలితాల్ని పొందలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీకి ఈ సారి ఒపీనియన్‌ పోల్స్‌ లో మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ.. బీఆర్‌ఎస్‌ కన్నా ముందు ఉందని చెబుతున్నాయి. క్లియర్‌ కట్‌ మెజార్టీ సాధించకపోయినా కాంగ్రెస్‌ పార్టీకే అడ్వేంటేజ్‌ ఉంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య కనీసం ఐదు సీట్ల గ్యాప్‌ ఉంటుందని ఒపీనియన్‌ పోల్‌ చెబుతోంది. అయితే ఓఏట్లు పోలరైజ్‌ అయితే.. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ గ్యాస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ ఇంత దూకుడుగా ఉన్నా వెనుకబడిరదన్న విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు నుంచి ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పదేళ్లుగా ఉన్న పాలన వల్ల ప్రజల్లో అధికార వ్యతిరేకత అనేది సహజంగానే పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ అధికార వ్యతిరేకత తగ్గించడానికి బీఆర్‌ఎస్‌ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పథకాలు అమలు చేస్తోంది. దళిత బంధు, బీసీ బంధు సహా అనేక పథకాలు ప్రవేశ పెట్టారు. త్వరలో మైండ్‌ బ్లాంక్‌ అయ్యే పథకాలతో మేనిఫెస్టో ప్రకటిస్తామని చెబుతున్నారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ.. ఇలాంటి పథకాలు ప్రకటిస్తే… ఇప్పటి వరకూ ఎందుకు అమలు చేయలేదన్న ప్రశ్న వస్తుంది. అది బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇ?బబందికరంగా మారింది. యాంటీ ఇన్‌కంబెన్సీని అధిగమించడం కత్తి విూద సవాల్‌ గా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్క చాన్స్‌ అనే నినాదాన్ని కాంగ్రెస్‌ పార్టీ నేతలు కొంత కాలంగా చేస్తున్నారు. అదే సమయంలో ఆరు గ్యారంటీ హావిూల్ని ప్రకటించి జోరు విూద ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించినప్పటి నుండి .. ఆ పార్టీ పూర్తి స్థాయిలో జోష్‌ చూపిస్తోంది. రేవంత్‌ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. సీనియర్లు తమ మార్క్‌ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని చూపించడం మానేశారు. గెలుస్తుందన్న నమ్మకం ఏర్పడటంతో గెలిచిన తర్వాత పదవుల కోసం కొట్లాట పెట్టకోవచ్చన్న ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్‌ పార్టీకి అడ్వాంటేజ్‌ అయింది. ఈ సారి గెలవకపోతే ఇంకెప్పుడూ గెలవలేమన్న అభిప్రాయంతో తాడేపేడో అన్నట్లుగాపోరాడుతున్నారు. గెలుపు గుర్రాలు అనుకున్న వారిని ఎవరినీ వదిలి పెట్టకుండా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఒపీనియన్‌ పోల్స్‌ లో కాంగ్రెస్‌ కాస్త ముందు ఉన్నందున.. బీఆర్‌ఎస్‌ ఒత్తిడిలో ఉందని అనుకోవడానికి లేదు. కేసీఆర్‌ ఎలాంటి రాజకీయ పరిస్థితులనైనా ఇట్టే మార్చగలరు. అందుకే వ్చేచ నెలన్నర రోజుల్లో బీఆర్‌ఎస్‌ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నది కీలకం. కేసీఆర్‌ జిల్లాలను ప్రచారంలో భాగంగా చుట్టేసి.. తెలంగాణకు బీఆర్‌ఎస్సే శ్రీరామరక్ష అనిపించగలికితే.. సీన్‌ మారిపోతుంది. అందుకే ఒపీనియన్స్‌ పోల్స్‌ ను బట్టి.. రాజకీయ పార్టీలు ఎలాంటి సమర్థవంతమైన వ్యూహాలను అమలు చేస్తాయన్నదాన్ని బట్టే ఫలితాల ఉంటాయని అనుకోవచ్చు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *