ఎమ్మెల్యేలే దళితబంధు రాబందులు

హైదరాబాద్‌, జూన్‌ 27 :
దళితబంధు పథకానికి ఎమ్మెల్యేలే రాబందులు అని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మళ్లీ దొంగలకే తాళాలు అప్పజెప్పారనే ఆరోపణలు ఉన్నాయి. అర్హుల ఎంపిక బాధ్యత మరోసారి వాళ్లకే ఇచ్చి.. దళితబంధు పథకాన్ని ‘‘కవిూషన్ల బంధు’’ అని చెప్పకనే చెప్పారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజక వర్గానికి 11 వందల మంది అంటే.. ఒక్కో ఎమ్మెల్యే సగం కవిూషన్లు తిన్నా 55 కోట్లు వస్తుందని అన్నారు. అలా 100 నియోజక వర్గాలకు లెక్కలు కడితే 6 వేల కోట్లు అవుతుందని.. దళిత బిడ్డల పేరు చెప్పి ఎన్నికల వేళ ఎమ్మెల్యేలకు వేల కోట్లు దొచిపెట్టే కుట్ర ఇదంటూ ఫైర్‌ అయ్యారు. కవిూషన్లు కొట్టండి, ఎన్నికల్లో ఖర్చు పెట్టండి అంటూ.. సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారని ఆరోపించారు.పథకం పక్కదారి పట్టిందని, ఎమ్మెల్యేలు పబ్లిక్‌ గా దోచుకుంటున్నారని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దళితబంధు.. ఎమ్మెల్యేల బంధులా మారిందని అన్నారు. సాక్ష్యాధారాలు బయట పెట్టినా.. దొర తీసుకున్న చర్యలు శూన్యం అని పేర్కొన్నారు. కవిూషన్ల కహానీ బయట పెడితే.. దొర అవినీతిపై ఎమ్మెల్యేలే తిరగబడతారని భయం పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. దళితబంధు ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని వెంటనే రద్దు చేయాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ డిమాండ్‌ చేస్తోందని వెల్లడిరచారు. గ్రామ సభలో కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే అర్హుల ఎంపిక జరగాలన్నారు. ఆర్థికంగా వెనుక బడిన దళిత బిడ్డలకు పూర్తి స్థాయి పరిహారం అందించాలని వివరించారు. కమిషన్లు అడిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెండు రోజుల్లో ఢల్లీి వెళ్లనున్నారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ లో పార్టీలో విలీనంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. రెండు సార్లు తెలంగాణ కాంగ్రెస్‌ లో చేరికలు , విలీన వ్యవహారాలను చూస్తున్న డీకే శివకుమార్‌ తో సమావేశం కూడా అయ్యారు. అయితే షర్మిల పార్టీ విలీనం చేసినా తెలంగాణలోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ మాత్రం ఆమెను ఏపీలో రాజకీయాలు చేయాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ తాను ఏపీలో రాజకీయాలు చేసే ప్రశ్నే లేదని పూర్తి స్థాయిలో తెలంగాణకే పరిమితం అవుతానని అంటున్నారు. షర్మిల ఏపీలో రాజకీయం చేయడానికి అంగీకరిస్తే వెంటనే విలీనం చేయడానికి హైకమాండ్‌ వెంటనే అంగీకరించే చాన్స్‌ ఉంది. కానీ ఏపీలో మాత్రం తన సేవలు ఉపయోగించుకోడానికి లేదని.. కేవలం తెలంగాణకు మాత్రమే అంటే.. హైకమాండ్‌ ఆలోచించే అవకాశం ఉందని అంటున్నరా?. ఢల్లీి పర్యటనలో షర్మిల ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.