చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలే టార్గెట్‌గా కొనసాగుతున్న రైడ్స్

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో 100 టీమ్స్‌తో సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిట్ ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీలు టార్గెట్‌గా రైడ్స్ కొనసాగుతున్నాయి. అమీర్‌పేట్, శంషాబాద్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. అమీర్‌పేట్ పూజకృష్ణ చిట్ ఫండ్స్ సంస్థపై 20 టీమ్స్ తనిఖీలు నిర్వహించాయి. డైరెక్టర్స్ సోంపల్లి నాగ రాజేశ్వరి, పూజ లక్ష్మీ, ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్లపై కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శంషాబాద్‌లో చిట్ ఫండ్స్ సంస్థ యజమాని రఘువీర్ ఇంటిపై సోదాలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లి ఇందు ఫార్చ్యూన్ విల్లాలో అరికపూడి కోటేశ్వరరావు ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ సంస్థల్లో ఆదాయపన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో సోదాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *