నేటి నుంచి అసెంబ్లీ
హైదరాబాద్: నేటి(గురువారం) నుంచి నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలలే ఉండటంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు తగిన బదులు ఇచ్చేందుకు అధికార పక్షం కూడా సిద్ధమైంది.
ఆగస్టు 3 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు వారం కంటే తక్కువ రోజులే సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12న ముగిశాయి. ఆరు నెలల్లో కనీసం ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున.. గురువారం నుంచి జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు, నాలుగు రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చునని భావిస్తున్నారు.