ఏ టూ జెడ్…ఏ న్యూ సెక్రటేరియెట్
ముఖ్యమంత్రి ఆలోచన.. ఆయన ప్లానింగ్, ముందు చూపుతో నిర్మాణం దీన్ని చేపట్టామని కొత్త సచివాలయ ఇంజనీర్లు వెల్లడిరచారు. అయితే.. ఇదే కాకుండా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొత్త సచివాలయం గురించి విశేషాలు వెల్లడిరచారు. మొత్తం భవనం 10 లక్షల చదరపు అడుగులు. 26 నెలల్లో పూర్తి చేశాం. 6 నెలలు కరోన వాళ్ళ పని నెమ్మదించింది. వెయ్యి లారీల రెడ్ స్టోన్ వాడము. ఒక మైన్ మొత్తం మాట్లాడుకున్నాం. ముందుగా మాట్లాడిన ఒక మైన యజమాని మాటిచ్చి పార్లమెంట్ కు రాయి తరలించారు. ఏసీ ప్లాంట్ కు 6 నెలలు పట్టింది. దాన్ని ఒక రూపు రావడానికి మరో 6 నెలలు పట్టింది. 30 కాన్ఫరెన్స్ హాల్స్.. ఒక్కోటి 10 సినిమా హాళ్ళకు సమానం. ఛత్తీస్ ఘడ్, గుజరాత్, సెంట్రల్ విస్టా దీని కంటె తక్కువే. జిఆర్సి (గల్వనైడ్ రీ ఎన్ఫోర్స్ మెంట్ కాంక్రీటు) తోడుగులకు 6 నెలలు పట్టింది. దాన్ని పూర్తి చేయడానికి ఏడాది పట్టింది. దేశంలో జిఆర్సీ అత్యంత ఎక్కువ వినియోగించింది తెలంగాణ ఒక్కటే. 14 ఫీట్లు ఒక ఫ్లోర్. ఎత్తు. పోర్టికో 42 ఫీట్స్ హైట్ మూడు ఫ్లోర్స్. 2065 కుతుబ్ మినార్ కంటే సెక్రటేరియట్ పెద్దది. 2039 తాజ్ మహల్ ఎత్తు.. చార్మినార్ 183. బుద్ధుడు 42, అంబేద్కర్ 175 అడుగులు.. ఒక అశోక్ చిహ్నం 14 ఫీట్స్. 28 ఫీట్ల ఎత్తుతో రెండు హాల్స్ బిల్డింగ్ పైన, డూమ్స్ కింద స్కై లాన్(2500 చఅ)(40 ఫీట్ల ఎత్తు) రాబోతుంది. ఒక్క ఫ్లోర్ 4 ? 5 వేల చదరపు అడుగులు. ఇతర దేశాల ప్రముఖులు వస్తే హైటి ఏర్పాటు కోసం నిర్మాణం.అక్కడి నుంచి సిటీ వ్యూ కనిపిస్తుంది. 34 డోమ్ లు సెక్రటేరియట్ నిర్మాణంలో ఉన్నాయి. 24 లిఫ్టులు? (8 స్కై లాన్ కోసం). 2 సర్వీసు లిఫ్టులు. పోర్టికోలు బయట 4, లోపల రెండు
సీఎంకు 2 లిఫ్టులు. 4 ప్రవేశ ద్వారాలు. ఈస్ట్ గేట్ ముఖ్యమంత్రి, క్యాబినెట్, సీఎస్, డిజిపి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల కోసం.. వెస్ట్ ? అత్యవసర.. నార్త్ ఈస్ట్ : ఉద్యోగులు, సిబ్బంది. పార్కింగ్, సౌత్ ఈస్ట్ : విజిటర్స్. (రెండు పార్కింగ్స్), 617 కోట్లతో నిర్మాణం చేస్తుంటే.. ణబబి 6 నుంచి 18 శాతం పెరిగింది. మరో 20, 30 శాతం కాస్ట్ పెరుగొచ్చు. బయట : రిసెప్షన్.. నితీతి సెల్, బ్యాంకులు, విూడియా, పబ్లిసిటీ సెల్, పొస్టాఫీలు, బస్, రైల్వే కౌంటర్, 2 ఏటీఎం, సెక్యూరిటీ, యూనియన్ ఆఫీసులు, ఇండోర్ గేమ్స్, హౌజిగ్ సొసైటీ కోసం 4 అంతస్తుల బిల్డింగ్ నిర్మించాము. మజీద్, గుడి, చర్చి ఉన్నాయి. 12 కోట్లు మెంటనెన్స్ అవుతుంది.10 నుంచి 15 సార్లు ముఖ్యమంత్రి పరిశీలించారు.ప్రతిరోజూ మానిటరింగ్ చేశారు. గోల్డ్ సర్టిఫికెట్ వస్తుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్.. త్వరలో ప్లాటినం సర్టిఫికెట్ కూడా వస్తుంది. దేశంలో గోల్డ్ బిల్డింగ్ సర్టిఫికెట్ కలిగిన ఏకైక నిర్మాణం. త్వరలో పార్కింగ్ ప్రదేశంలో సోలార్ సిస్టమ్ ఏర్పాటు. వాటర్ 120 సశ్రీట. 1.20లిటర్స్. 2 లక్షలు ఫైర్, 1.80 డొమెస్టిక్. 2.40 వేలు వర్షం నీరు నిల్వ కోసం. మొత్తం 5 లక్షల 60 వేల లీటర్ల నీటి నిల్వ. 10 ఎకరాల లాంజ్ లు రెండు.. 28 ఎకరాలు మొత్తం. 2.5 ఎకరాల్లో బిల్డింగ్ నిర్మాణం. 300 మంది సెక్యూరిటీ రెండు షిఫ్టులు. విజిటర్స్ కోసం ప్రత్యేక యాక్సిస్ కార్డులు. 300 సీసీ కెమెరాలు ఏర్పాటు. కమాండ్ కంట్రోల్ ఉంటుంది. వెనుక వైపు ఏడో ఫ్లోర్ లో ఉంటుంది.’ అని తెలిపారు.
ఏ అంతస్తులో ఏ శాఖ కొలువుదీరుతుంది?
గ్రౌండ్ ఫ్లోర్ని ఎస్సీ అభివృద్ధి, రెవెన్యూ శాఖకు కేటాయించారు. మొదటి అంతస్తులో పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి, విద్యాశాఖ కొలువుదీరుతుంది. రెండో ఫ్లోర్లో ఫైనాన్స్, ప్లానింగ్ ,వాణిజ్య పన్నుల శాఖలుంటాయి. మూడో అంతస్తుని మున్సిపల్, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖలకు కేటాయించారు. ఫోర్త్ ఫ్లోర్లో నీటిపారుదల, అటవీశాఖ, పర్యావరణం ,దేవాదాయ శాఖలు ఉంటాయి. ఐదో అంతస్తులో రవాణ, రోడ్లు భవనాలు, సాధారణ పరిపాలన శాఖలు కొలువుదీరుతాయి. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి పేషీ ఉంటుంది. సీఎస్, సీఎంవో అధికారులు కూడా అక్కడే ఉంటారు.
ఏ ఫ్లోరుకి వెళ్లినా గాలి, వెలుతురు ధారాళంగా
నూతన సచివాలయాన్ని గ్రీన్ కాన్సెప్ట్ విధానంలో డిజైన్ చేశారు. ఏ ఫ్లోరుకి వెళ్లినా గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. చుట్టూ గదులు, మధ్యలో ఖాళీ స్థలం ఉంచారు. మొత్తం 8 ఎకరాల స్థలాన్ని పచ్చదనం కోసం కేటాయించారు. భవనానికి నలువైపులా వెడల్పైన మెట్ల దారి ఉంటుంది. దాంతో పాటు భారీ లిఫ్టులను ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే కిందకు చేరుకునేలా ఇవి పనిచేస్తాయి. ఫైర్ సేఫ్టీ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ అన్నమాటే తలెత్తదు. ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావులేదు. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎక్కడికక్కడ నిలిపివేసేలా ఏర్పాట్లు చేశారు. సుమారు రూ. 617 కోట్ల అంచనా వ్యయంతో, అత్యాధునిక హంగులతో కూడిన భవన సముదాయాన్ని నాలుగేండ్లలోపే పూర్తిచేసి, ప్రారంభానికి సిద్ధం చేశారు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ ఈ సచివాలయాన్ని నిర్మించింది.