సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్‌ కపూర్‌?

రామాయణ కథ మరోసారి సినిమా రూపంలో రానుంది. ఇందుకోసం బాలీవుడ్‌ దర్శకుడు నితేశ్‌ తివారీ చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటించే ఈ చిత్రంలో సీత పాత్ర కోసం ఇంతకుముందు కొన్ని పేర్లు వినిపించాయి. వాటిలో అలియా భట్‌ పేరు ఉంది. . అయితే ఏమైందో ఏమో తాజాగా సాయిపల్లవి పేరు బయటికి వచ్చింది. సీత పాత్ర కోసం ఆమెను సంప్రదించగా అంగీకరించారనీ, త్వరలో లుక్‌ టెస్ట్‌ చేస్తారని అంటున్నారు. అలాగే రాక్‌స్టార్‌ యశ్‌ ఇందులో రావణుడి పాత్రను పోషించనున్నారని సమాచారం. రెండు భాగాలుగా రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మొదలవుతుంది. ఆగస్టు వరకూ జరుగుతుంది. సీతాపహరణ దృశ్యంతో తొలి భాగం షూటింగ్‌ పూర్త్తవుతుందట. రావణ పాత్రధారి యశ్‌ జూలై నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది. లంకా నగరానికి సంబంధించిన దృశ్యాలు చిత్రీకరించడం కోసం శ్రీలంకలో సెట్స్‌ నిర్మించనున్నారు. ఈ సినిమాలో విఎ్‌ఫఎక్స్‌ కోసం ఆస్కార్‌ అవార్డ్‌ అందుకున్న డిఎన్‌ఈజీ సంస్థతో నిర్మాతలు అల్లు అరవింద్‌, మధు మంతెన సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతి కలిగించే విధంగా రామాయణ కథను తెరకు ఎక్కించడం కోసం మేకర్స్‌ ఎంతో కృషి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *