కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరుకానుండగా తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ సమక్షంలో ఇరువురు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి ఇంట్లో చర్చలు జరిపారు. అయితే ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో వీరిని చేర్చుకోవడంతో కాంగ్రెస్ ఒక దూకుడైన సిద్ధాంతంలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంకా పెద్ద ఎత్తున చేరికలు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతుంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కు గట్టి పోటీ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో బలంగా పార్టీని తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. బలమైన లీడర్లను చేర్చుకోగలిగితే వాళ్ల స్థాన బలంతో గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ క్రమంలోనే పొంగులేటి, జూపల్లి సహా బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్త నేతలపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టింది. రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయాత్నాల్లో కాంగ్రెస్ ఉంది.పొంగులేటి, జూపల్లికి ప్రజాబలం ఉండటంతో పాటు ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో రాహుల్ గాంధీ టీమ్ వారితో చర్చలు జరిపింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పోదెం వీరయ్య నియోజకవర్గాలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిగతా సీట్లన్నీ పొంగులేటి అనుచరులకు ఇచ్చేందుకు రాహుల్ గాంధీ టీమ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్ లో తనతో పాటు తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నాడు. దీంతో పాటు ఆయనపై ఢల్లీి నుంచి హస్తం పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. కేసీఆర్ ను ఓడిరచాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ లో చేరితేనే నెరవేరుతుందని.. ఈ టైంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హస్తం నేతలు సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 30వ తారీఖున వీరు చేరుతున్నట్లు తెలుస్తుంది.
నల్గోండ దీక్ష రద్దు
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి ఇంటిపోరు రచ్చకెక్కింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన నిరుద్యోగ నిరసనకు కాంగ్రెస్ సీనియర్లు చెక్ పెట్టారు. దీంతో నల్గొండ జిల్లాలో ఎంజీ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి తలపెట్టిన నిరుద్యోగ నిరసన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తన జిల్లాలో తనకు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు చేపట్టడం ఏంటని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడంతో దీంతో టీపీసీసీ ఈ నిరసన సభను రద్దు చేసింది. తనకు సమాచారం ఇవ్వకుండానే నిరుద్యోగ సభ ఏర్పాటు చేశారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి… కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ థాక్రేకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందనో లేక అధిష్ఠానం ఆదేశించిందో గానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ సభను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ఇలా చేశారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో తిరుగులేని స్థితిలో ఉన్న రేవంత్రెడ్డికి తొలిసారి గట్ట ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరంతో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన నల్గొండ నిరుద్యోగ నిరసన దీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ పోరులో సీనియర్లతో పైచేయిగా నిలిచింది. రేవంత్ రెడ్డి ప్రకటనపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన జిల్లాలో తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, చర్చించకుండా ఏ విధంగా సభ నిర్వహిస్తారని విూడియా పరంగా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దీక్షపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో అధిష్ఠానం ఆదేశించిందో లేక ఆయనే వెనక్కి తగ్గారో కానీ రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరసన విరమించుకున్నారు. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పే కాంగ్రెస్ రానున్న ఎన్నికల కోసం కొన్ని రోజులుగా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర స్ఫూర్తితో హాథ్ సే జోడో యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పలు కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ శ్రేణులను తిరిగి యాక్టివేట్ చేసే పనిలో పడిరది కాంగ్రెస్ నాయకత్వం. తాజాగా టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారాన్ని కూడా సమర్థంగా వాడుకుంది. క్వశ్చన్ పేపర్ల లీకులతో నిరుద్యోగుల సమస్యలు మరోసారి ఫోకస్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరగాల్సి ఉండగా.. నిరసన కార్యక్రమంపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమం గురించి తనకేవిూ తెలియదని ఉత్తమ్ అన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తనతో చర్చించకుడానే నిరసన కార్యక్రమ నిర్ణయం తీసుకున్నారని, అంతే కాకుండా మాజీ పీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎంపీ అయిన తనకు అధికారిక సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు తాను ఎవరితోనూ చెప్పలేదని, తనతో చర్చించి నిరసన కార్యక్రమం చేపట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన పార్టీ తన నియోజకవర్గంలో నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో నిర్వహిస్తుందన్న విషయాన్ని విూడియా ద్వారా తెలుసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.