కోచ్‌గా హఫీజ్‌ కావాలి!

వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకొంటోంది. ఇందులో భాగంగా అత్యుత్తమ కోచ్‌ వద్ద శిక్షణ పొందాలని యోచిస్తోంది. మలేసియాకు చెందిన ప్రముఖ కోచ్‌, ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ మహ్మద్‌ హఫీజ్‌ షహీమ్‌ కోచ్‌గా కావాలని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌)కు సింధు లేఖ రాసింది. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లో భాగంగా తనకు శిక్షకుడిగా హఫీజ్‌ను కేటాయించాలని ఆ లేఖలో కోరింది. సింధు విన్నపానికి ‘సాయ్‌’ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశముంది. కొరియా కోచ్‌ పార్క్‌ టే సంగ్‌ ఆధ్వర్యంలో సన్నద్ధమై టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన సింధు.. ప్రస్తుతం ‘సాయ్‌’ కోచ్‌ విధి చౌదరి వద్ద శిక్షణ తీసుకుంటోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *