మహేష్‌బాబు సినిమా చూసి ఎంపీనయ్యా!

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir kapoor), రష్మిక మందన్నా 9Rashmika mandanna) జంటగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్‌’ (Animal)చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తెలుగు సినిమాలు, మేకర్స్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
ఆయన మాట్లాడుతూ ‘‘మహేశ్‌బాబు‘(Maheshbabu) బిజినెస్‌మేన్‌’ చూసి రాజకీయాల్లోకి వచ్చా. ఆ సినిమాను పదిసార్లు చూసి ఎంపీ అయ్యాను. రణ్‌బీర్‌ కపూర్‌ మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా. వచ్చే ఐదేళ్లలో మొత్తం భారతదేశం, హాలీవుడ్‌, బాలీవుడ్‌ను మా తెలుగువాళ్లు రూల్‌ చేస్తారు. ఒక ఏడాది ఆగితే మీరు హైదరాబాద్‌కు మారిపోవడం మంచిది. ఎందుకంటే, ముంబయి ఓల్డ్‌ అయిపోతుంది. బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కువ. అన్ని వసతులు కలిగిన ఏకైక సిటీ హైదరాబాద్‌. తెలుగు వాళ్లు చాలా స్మార్ట్‌. మా దగ్గర రాజమౌళి, దిల్‌ రాజు, ఇప్పుడు సందీప్‌రెడ్డి ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌ సిటీ అన్ని రకాలుగా టాప్‌లో ఉంటుంది. మా కాలేజ్‌ వేదికగా ఈవెంట్‌ జరుగుతోంది. మీ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. రూ.500 కోట్లకు పైగా వసూళ్లు చేయాలని కోరుకుంటాం’’ అని అని అన్నారు. మల్లారెడ్డి మాటలకు మహేశ్‌బాబు, రణ్‌బీర్‌ కపూర్‌, దర్శకుడు రాజమౌళి చిరునవ్వులు చిందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అయితే మల్లారెడ్డి మాటల్ని కొందరు ఎంజాయ్‌ చేస్తుంటే, మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. తమ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ వచ్చిన బాలీవుడ్‌ సెలబ్రిటీల ముందే బాలీవుడ్‌ని కించపరిచేలా మాట్లాడటం తగదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సందీప్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇందులో బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా, అనిల్‌ కపూర్‌ రణ్‌బీర్‌కు తండ్రిగా నటించారు. తండ్రీ-కొడుకుల అనుబంధం, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *