ద్విచక్రవాహనం డివైడర్‌ ను ఢీ కొన్న ఘటన

అన్నమయ్య జిల్లా :
అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణం బస్టాండ్‌ సవిూపంలో ద్విచక్రవాహనం డివైడర్‌ ను ఢీ కొన్నఘటనలో ఒకరు మృతి చెందారు, మరోకరికి ఒకరికి తీవ్ర గాయాలైయాయి. సంఘటన బుధవారం సాయంత్రం కలికిరి పట్టణంలో చోటుచేసుకుంది. కలకడ వైపు నుండి టౌన్‌ లోకి వెళుతూ ఉండగా వెళ్తూ ఉన్న భూమా వినయ్‌ కుమార్‌ ( 20), జరుగుమల్లి వీరయ్య (45) బస్టాండ్‌ సవిూపం వద్ద రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ కు ఢీ కొనడంతో క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెనకవైపు ఉన్న భూమా వినయ్‌ కుమార్‌ తలకు తీవ్ర గాయమవడంతో మృతిచెందాడు. జరుగుమల్లి వీరయ్య కు కూడా రక్త గాయా లయ్యాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైనచికిత్స కొరకు తిరుపతి రుయా కు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *