సీఎం ఛాంబర్‌ కు బాహుబలి డిజైన్‌

28 ఎకరాల సువిశాల ప్రాంగణం.. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకున్న పరిపాలనా భవనం.. తెలంగాణ సహా విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలుల్లో రూపుదిద్దుకున్న కట్టడం! తెలంగాణ నూతన సచివాలయం.. వందేళ్ల విజన్‌ కు నిలువెత్తు నిదర్శనం అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు! హుస్సేన్‌ సాగర్‌ తీరాన నిర్మించిన తెలంగాణ కొత్త సచివాలయానికి ఎన్నో ప్రత్యేకతలు. 28 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కొత్త పరిపాలనా సౌధం కొలువుదీరింది. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకున్న భవనం ఇది. తెలంగాణ సహా విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలిలో తీర్చిదిద్దారు. ఆరు అంతస్తులుగా నిర్మితమైన ఈ భవనంలో ఎన్నో ప్రత్యేకతలు! ప్రవేశ ద్వారాలు మొదలుకొని.. ముఖ్యమంత్రి కొలువుదీరే ఆరో అంతస్తు వరకు అడుగడుగునా ఆధునిక సౌకర్యాలు, అంతర్గత సౌందర్యాలు! అన్నింటిట కలబోతగా దీన్ని నిర్మించారు. భవనం ఎత్తు 265 అడుగులు. 650 మంది సిబ్బందితో సచివాలయానికి నిరంతరం పహారా కాస్తుంటారు. నీటి సరఫరా, వాననీటి సంరక్షణ.. ఇలా పలు అంశాల్లో నూతన ప్రాంగణంలో దేనికదే ప్రత్యేకం. సచివాలయ భవనం ఎంత చూడముచ్చటగా కనిపిస్తోందో అంతకు దీటుగా మహాద్వారం చూపరులను ఆకట్టుకునేలా రూపొందించారు. 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తుంటుంది. ఈ దర్వాజకు నాలుగు తలుపులుంటాయి. ఆదిలాబాద్‌ అడవుల్లోని నాణ్యమైన టేకు కలపను సేకరించి, దాన్ని నాగపూర్‌ పంపి అక్కడ మహాద్వారాన్ని తయారు చేయించారు. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయానికి 875కి పైగా తలుపులున్నాయి. అన్నింటినీ టేకుతోనే తయారు చేశారు. సీఎం ఛాంబర్‌ తలుపుకు బాహుబలి డిజైన్‌ చెక్కారు. గాండ్రిస్తున్న సింహం నోట్లో కొక్కెం ఉండేలా ఇత్తడి పోత పోశారు. దాని చుట్టూ పూల డిజైన్లతో మహా గంభీరంగా ఉంది ద్వారం. ఇకపోతే, సచివాలయం నిర్మాణంలో 7 వేల టన్నుల ఉక్కు వాడారు. 35 వేల టన్నుల సిమెంటు అవసరమైంది. 26 వేల టన్నుల ఇసుక కలిపారు. 60 వేల క్యూబిక్‌ విూటర్ల కాంక్రీటు వినియోగించారు. 11 లక్షల ఇటుకలు సచివాలయం భవనం కోసం వాడారు. 3 లక్షల చదరపు అడుగుల గ్రానైట్‌, లక్ష చదరపు అడుగుల మార్బుల్‌, 3,500 ఘనపు విూటర్ల ధోల్‌ పూర్‌ రెడ్‌ స్టోన్‌, 7,500 ఘనపుటడుగుల కలపను వినియోగించారు. 12 వేల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేయడం వల్లే ఈ మహాద్భుతం కళ్లముందు ఆవిష్కృతమైంది.సచివాలయంలోకి ప్రవేశించగానే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే కళాకృతులు, పెయింటింగ్స్‌ అమర్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చేర్యాల పెయింటింగ్స్‌ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కొన్ని నమూనాలను ఇప్పటికే పరిశీలిస్తున్నారు. 34 గుమ్మటాలు, జాతీయ చిహ్నాలు కొత్త సచివాలయానికి మణిమయ మకుటాల్లా నిలిచాయి. కింది నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్మించిన డోమ్స్‌.. ఆధునిక ఇంజినీరింగ్‌ కౌశలానికి నిదర్శనం. 165 అడుగుల ఎత్తున ప్రధాన డోమ్‌ నిర్మించటం నిర్మాణ రంగంలోనే అతిపెద్ద సవాల్‌ అని నిపుణులు అంటున్నారు. సచివాలయానికి ముందు, వెనుక చెరొక ప్రధాన గుమ్మటాన్ని నిలబెట్టారు. ఈ రెండిరటిపైనా జాతీయ చిహ్నమైన మూడు సింహాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఒక్కోటి అయిదు అడుగుల ఎత్తు ఉంటుంది. 2.5 టన్నుల బరువుండే ఈ సింహాల బొమ్మలను ఢల్లీిలో చేయించి తీసుకువచ్చి అమర్చారు. మరో 32 మూడు సింహాల చిహ్నాలు చిన్న డోమ్స్‌ భవనంపై కనిపిస్తాయి.
ఆరో అంతస్తుకు.. టైట్‌ సెక్యూరిటీ
సీఎం కేసీఆర్‌ లక్కీ నెంబర్‌ ఆరు. అది అందరికీ తెలిసిన విషయమే! అందుకే ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్‌ పెట్టారు. లోపల జనహిత పేరిట కట్టిన హాల్‌ ప్రజాదర్బారు కోసం పెట్టారు. ఆరో అంతస్తులోనే కేబినెట్‌ భేటీ జరుగుతుంది. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్‌ హాలును రూపొందిచారు. ముఖ్యమైన, విశిష్ట అతిథులతో కలిసి సీఎం భోజనం చేసేందుకు ఒక అత్యాధునిక డైనింగ్‌ హాల్‌ ఏర్పాటు చేశారు. అందులో ఒకేసారి 25 మంది కూర్చుని తినొచ్చు.ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగు విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్‌ పరిచిన ఆ ప్రాంతం చూపరులను ముగ్ధులను చేస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయం కారిడార్‌ను ప్రత్యేకమైన మార్బుల్స్‌తో సుందరీకరించారు. తెలంగాణ సాంస్కృతిక సంపద ప్రతిబింబించేలా సీఎం చాంబర్‌ తలుపులు ఉంటాయి. సీఎం గది తలుపులపై సింహం ప్రతిమతో బహుబలి డిజైన్‌ తీర్చిదిద్దారు. వివిధ అంశాలపై అన్ని శాఖల ఉన్నతాధికారులు సవిూక్ష నిర్వహించేందుకు సీఎం కాన్ఫరెన్స్‌ హాలు అత్యాధునిక వసతులతో నిర్మించారు. సీఎం కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు.ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు జనహిత పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్‌ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు సీఎం విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్‌ హాలును ఏర్పాటు చేశారు.కొత్త సచివాలయంలో వెహికిల్‌ పార్కింగ్‌ సదుపాయం కూడా భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. ప్రాంగణంలో కేవలం సీఎం, మంత్రులు, అధికారులు, సిబ్బందికి మాత్రమే పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది. సుమారు 2.5 ఎకరాల్లో అధికారులు, సిబ్బందికి చెందిన 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, నాలుగు బస్సులు ఏకకాలంలో పార్కింగ్‌ చేసేందుకు అవకాశం ఉంది. కనీసం 300 కార్లు పట్టే 1.5 ఎకరాల ప్రాంతాన్ని సందర్శకులకు కేటాయించారు. సాధారణ రోజుల్లో రోజుకు 700 నుంచి 800 మంది, అసెంబ్లీ సమావేశాల సమయంలో 1,000 మంది వరకు సచివాలయానికి వస్తారని అంచనా. ఆ మేరకు పార్కింగ్‌ సదుపాయాన్ని కల్పించారు.సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.చీమ చిటుక్కుమన్నా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి అన్ని విభాగాల భద్రాతాధికారులకు చేరిపోతుంది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్‌ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోనికి ప్రవేశించగలరు. అంటే లోపలికి వెళ్లడం అంత ఆషామాషీ కాదు. నిత్యం సుమారు 650 మందికిపైగా భద్రతా సిబ్బంది పహారా కాస్తారు. రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్ఠమైన సీసీటీవీల కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సందర్శకుల ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా వారి సమాచారం అప్పటికప్పుడు ఆధార్‌ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు వెంటనే కంప్యూటర్‌ తెరపై కనిపిస్తాయి. దాంతో వచ్చిన మనిషి నేర చరిత్రను వెంటనే పసిగట్టి, అభ్యంతరం ఉంటే విజిట్‌ నిలిపివేస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *