అత్యాచారం కేసు పెట్టిన బాలిక…ఆపై ఆసుపత్రి

పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనపై ఓ బాలుడు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక(Minor Girl)…అనంతరం ఆసుపత్రిలో ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిన ఉదంతం పంజాబ్ రాష్ట్రంలోని చండీఘడ్ నగర పరిధిలోని జిరాక్ పూర్ ప్రాంతంలో వెలుగుచూసింది.(Zirakpur Case) బాధిత బాలిక బుధవారం జిరాక్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఓ యువకుడిపై పోలీసులు కేసు(Case Registered) నమోదు చేశారు.(Girl Delivers Baby)నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. మూలాల ప్రకారం నిందితుడు కూడా మైనర్ అని, అయితే అతని అరెస్టు తర్వాత మాత్రమే స్పష్టత వస్తుందని పోలీసులు చెప్పారు.

బాధితురాలు,నిందితులు ఇద్దరూ జిరాక్‌పూర్‌లోని ఒక మురికివాడలో నివసిస్తున్నారని, రెండు కుటుంబాలు ఒకరికొకరు తెలుసునని పోలీసులు చెప్పారు.మంగళవారం సాయంత్రం బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో, ఆమె గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.బాధితురాలి వాంగ్మూలం ప్రకారం.. కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులు లేని సమయంలో నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.జరిగిన ఘటనను ఎవరికీ చెప్పవద్దని నిందితుడు బెదిరించినట్లు బాధిత బాలిక తెలిపారు.బాధిత బాలిక ప్రసవించడంతో నిందితుడిపై 376, 506,పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *