తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది

హైదరాబాద్‌, జూలై 6
తెలంగాణలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీని దీటుగా ఎదుర్కోనే కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పదవి నుంచి దిగిపోయారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్‌ నియమించింది. అయితే, అంతా సరిగ్గా ఉన్న టైంలో అసలేందుకు ఈ మార్పు..? దీనివల్ల తెలంగాణ బీజేపీకి నష్టమా..?లాభమా..? ఆ వివరాలపై ఓ లుక్కేయండి.2019 లోక్‌ సభ ఎన్నికలు అయ్యాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ నియమితులయ్యారు. కరీంనగర్‌ ఎంపీగా విజయం సాధించిన అప్పటి నుంచి ఆయనది ఒకటే మంత్రం. సీఎం కేసీఆర్‌ పై దూకుడు. కేసీఆర్‌ మాటలకు.. మాటలతోనే తిప్పికొట్టాలనే ఫార్ములానా బాగా ఒంట పట్టించుకున్నారు. ఈయన హయాంలోనే దుబ్బాక, హుజురాబాద్‌, మునుగోడు వంటి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మునుగోడులో ఓడిపోయినప్పటికీ బీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్న ఫీలింగ్‌ తెప్పించింది. ఇక హైదరాబాద్‌ ఉఊఓఅ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. పాదయాత్రతో బండి సంజయ్‌ బీజేపీని గ్రామాల్లోకి తీసుకెళ్లారు. అయితే మె?త్తం ఫేమ్‌ ఆయనకే వస్తుంది. పార్టీలో చేరిన తమకు ప్రాధాన్యత దక్కట్లేదు అన్నది మిగతా లీడర్ల ఆరోపణలు. అందుకే.. పార్టీ ప్రెసిడెంట్‌ గా కొత్త వాళ్లను పెట్టాలని కొందరు నేతలు డిమాండ్‌ చేశారని తెలుస్తోంది. బండి సంజయ్‌ సారథ్యంలో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఆయనను మార్చడం ఎందుకున్నది ఢల్లీి పెద్దల ఆలోచన. కానీ, బీజేపీలోకి వలస వచ్చిన నేతలు మాత్రం తమకు ప్రాధాన్యత కోసం బండి సంజయ్‌ ను దింపాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో ఏం చేయాలో తోచక బీజేపీ అగ్రనాయకత్వం పార్టీ అధ్యక్షుడు మార్పునకు ఒకే చెప్పిందికానీ ఇక్కడే అసలు సమస్య వచ్చి పడిరది. బండి సంజయ్‌ ప్లేస్‌ లో ఎవరిని ఎంపిక చేయాలి..? ఎందుకంటే ఆ పదవి కోసం చాలా మంది పోటీపడుతున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావుల మధ్య పోటీ ఉంది. ఈ సమయంలో ఒకరికి పదవి ఇస్తే.. ఇంకోకరి హర్ట్‌ అవుతారని భావించిన దిల్లీ పెద్దలు అడక్కపోయినప్పటికీ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవికి కట్టబెట్టారు. ఎందుకంటే ఆయన పార్టీలో సీనియర్‌, అందరితో సన్నిహత సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో లీడర్లను సమన్వయ పరచుకోవడంలో ఆయన దిట్ట. అందుకే పదవి కోసం పోటీ పడిన వాళ్లను పక్కన పెట్టి.. పార్టీలో అందరివాడుగా కలుపుగోలుగా ఉండే కిషన్‌ రెడ్డికి అవకాశం ఇచ్చారు.అదే సమయంలో ఈటల రాజేందర్‌ అసంతృప్తిని చల్లార్చేందుకు.. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఇచ్చారు. ఇక ఎన్నికల బాధ్యత ఈటల రాజేందర్‌ ని అన్న కోణంలో ఆయనకు ఈ పదవి ఇచ్చారు. దీంతో ఆయనతో పాటు ఆయన అనుచరులు కూల్‌ అవుతారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కానీ, రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న రఘునందన్‌ రావుకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. సో.. ఇప్పుడు రఘునందన్‌ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఓ వైపు కాంగ్రెస్‌ జోరు పెరుగుతున్న సమయంలో బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్‌ పెట్టేందుకు ఢల్లీి పెద్దలు ఈ ప్రయత్నం చేశారు. మరి రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతోనైనా బీజేపీలో ముసలం చల్లబడుతుందా..? లేదా సరికొత్త చిక్కులు వస్తాయా..? అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది
జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యునిగా నియమిస్తూ.. బీజేపీ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన పదవులకు మంగళవారం నియామకాలు చేశారు. ఆ సమయంలో ఏపీ నుంచి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యునిగా పదవి ఇచ్చారు. అయితే అప్పుడు రాజగోపాల్‌ రెడ్డికి పదవి గురించి ఆలోచించలేదు. ఈ నియామకాల ప్రకటన వెలువడిన తర్వాత … రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్‌ లో చేరిన పొంగులేటితో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ లోపే ఆయనకు బీజేపీ హైకమాండ్‌ జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న పదవిని ప్రకటించారు రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ నాయకుడు. ఆయన ఇటీవల బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో మళ్లీ తన స్థానం మునుగోడు నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. రేవంత్‌ రెడ్డిని టీ పీసీసీ చీఫ్‌ను చేయడాన్ని రాజగోపాల్‌ రెడ్డి వ్యతిరేకించారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ. ఆయన కూడా రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అయితే మొదట ఉపఎన్నిక వ్యూహంలో భాగంగా రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరారు. తర్వాత వెంకటరెడ్డి కూడా చేరుతారని అనుకున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తం సీన్‌ మారిపోయింది. కేసీఆర్‌ ను ఓడిరచే పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రకటనలు చేస్తూ వచ్చిన రాజగోపాల్‌ రెడ్డి ఇప్పుడు బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కవితను అరెస్ట్‌ చేయకపోవడం ఢల్లీి లిక్కర్‌ స్కాంలో తదుపరి చర్యలు తీసుకోకపోవడం.. బీఆర్‌ఎస్‌ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని రాజగోపాల్‌ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన సోదరుడు వెంకటరెడ్డి కూడా.. రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ లోకి వస్తారని చెబుతున్నారు. ఇవాళ కాకపోతే.. రేపైనా రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఆయన పార్టీ మారకుండా చూసేందుకు పదవుల్లోనూ ప్రాధాన్యం ఇస్తామని చెప్పేందుకు ప్రత్యేకంగా జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమించారు. దీంతో ఇప్పుడు రాజగోపాల్‌ రెడ్డి ఎలాస్పందిస్తారన్నది ఆసక్తికరంగామారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *