బండి బెయిల్‌ రద్దు సాధ్యమేనా

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు మంజూరైన బెయిల్‌ పిటిషన్‌ ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హన్మకొండ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎస్‌ఎస్సీ హిందీ పేపర్‌ వాట్సాప్‌ ద్వారా బయటకు వచ్చిన కేసులో ఆయన పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని, ఫోన్‌ ఇవ్వడం లేదని ఆ పిటిషన్‌ లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అందులో ఆరోపించారు. అందుకే ఆయన బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బండి బెయిల్‌ రద్దు చేయాలని గతంలోనూ పిటిషన్‌ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ కేసులో నిందితులు ఏ6, ఏ9 బెయిల్‌ పిటిషన్ల పన కూడా వాదనలు ముగిశాయి..సంచలనం రేపిన పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపి బండి సంజరును పోలీసులు కుట్ర దారునిగా గుర్తించి ఏ ` 1 పెట్టి కేసులు నమోదు చేశారు. 120 బి, 420, 447, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాట్సాప్‌ ద్వారా విూడియాకు రావడం… అక్కడి నుండి ఓ మాజీ విూడియా ప్రతినిధి బండి సంజయ్‌ సహా పలువురు రాజకీయ నాయకులకు దానిని పంపించడం జరిగింది. పరీక్ష పూర్తి కావడానికి మరో అరగంట ఉందనగా బండి సంజయ్‌ వాట్సాప్‌ కు అది వచ్చింది. దీంతో పోలీసులు బండి సంజయ్‌ సహా పలువురిని అరెస్ట్‌ చేసి, జైలుకు పంపించారు. ఈ కేసులో బండి సంజయ్‌కు హనుమకొండ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 20వేలతో పాటు ఇద్దరి పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విచారణకు సహకరించాలని ఆదే?శించింది. తర్వాత బండి సంజయ్‌ను ఫోన్‌ అప్పగించాలని విచారణకు రావాలని హన్మకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోన్‌తో విచారణకు రావాలని పిలుపునిచ్చారు. అయితే తన ఫోన్‌ పోయిందని అందుకే విచారణకు రాలేనని చెప్పారు బండి సంజయ్‌. తన ఫోన్‌ దొరికే వరకు విచారణకు పిలవద్దని చెప్పారు. ఎంపిగా ఉన్న తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని పోలీసులకు చెప్పారు. మరోవైపు ఈ కేసులో తనపై లేనిపోని ఆరోపణలు చేశారని వరంగల్‌ సీపీ రంగనాథ్‌పై బండి సంజయ్‌ తీవ్ర విమర్శలుచేశారు. ఆయనపై కోర్టులో పరువునష్టం దావా వేస్తానన్నారు. రంగనాథ్‌ ఇష్యూను అంత తేలిగ్గా విడిచిపెట్టబోమని ప్రకటించారు. ఆయన తీరుపై రంగనాథ్‌ కూడా స్పందించారు. నిందితులు … పోలీసులపై అసహనం వ్యక్తం చేయడం.. ఆరోపణలు చేయడం సహజమేనన్నారు. సాక్ష్యాల ప్రకారమే కేసులు పెట్టామన్నరు.
అంతా సైలెంట్‌… ఏమౌతోంది…
టెన్త్‌ పేపర్లు లీక్‌ కాలేదు కేవలం మాల్‌ ప్రాక్టీస్‌ మాత్రమేనని .. వరంగల్‌ సీపీ రంగనాథ్‌? బండి సంజయ్‌ చేసిన ఆరోపణలకు .. చేసిన సవాళ్లకు ప్రతి సవాళ్లు.. సమాధానాలిచ్చేందుకు పెట్టిన ప్రెస్‌ విూట్‌లో నొక్కి చెప్పారు. నిజానికి పేపర్‌ లీక్‌ చేశారని.. కుట్ర చేశారని అదే పనిగా ప్రచారం చేశారు. చివరికి సీపీ కూడా మాల్‌ ప్రాక్టీస్‌ కేసని చెప్పారు. అందులో ఏ వన్‌ గా బండి సంజయ్‌ ను చేర్చారు. ప్రభుత్వంపై దుష్ప్రచారానికి కుట్ర చేశారని ఆరోపించారు. ఇంత చేసినా ఆ కేసు రెండు రోజుల్లో తేలిపోయింది. ఇప్పుడు పట్టించుకునేవారు లేరు. అసలు పేపర్‌ ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు పట్టించుకోలేదు. ఓ విద్యార్థి దగ్గర్నుంచి ఎవరు ఫోటో తీశారో బయటకు చెప్పడం లేదు. కానీ ప్రశాంత్‌ అనే జర్నలిస్టు దగ్గర్నుంచి బీజేపీ నేతలకు ఫార్వార్డ్‌ అయిందని? బండి సంజయ్‌కు ఆప్రశాంత్‌ ఫోన్‌ చేశారని కుట్ర కేసు పెట్టి రాత్రికి రాత్రి అరెస్ట్‌ చేశారు. దీనిపై ఓ పెద్ద కథను సీపీ రంగనాథ్‌ చెప్పారు. ఫోన్‌ దొరకలేదన్నారు. ఫోన్‌ దొరకబుచ్చుకోవడం పోలీసులు ఓ పెద్ద పనా ?. పోలీసులు అరెస్ట్‌ చేసినప్పుడు బండి సంజయ్‌ వద్దే ఫోన్‌ ఉంది. వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. తీసుకోవాలనుకుంటే ఎప్పుడెందుకు తీసుకోలేదు ? ఇప్పుడు ఆ ఫోన్‌ దొరికే వరకూ తాను విచారణకు రానని నేరుగా బండి సంజయ్‌ చెప్పారు. ఆ ఫోన్‌ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన వారందరికీ బెయిల్స్‌ వచ్చాయి. వరంతా పోలీసులు రాజకీయ కుట్ర చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడీ కేసులో పోలీసలు? కూడా ఏవిూ చేయకుండా సైలెంట్‌ అయిపోయారు. ఇంకా ముందుకు వెళ్తే మొత్తం నిజాలు వెలుగులోకి వస్తాయని ఊరుకున్నారేమో కానీ? బీజేపీ నేతలు మాత్రం దీన్ని రాజకీయంగానే చూసుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకున్న కేంద్రం.. మొదట బండి సంజయ్‌ ను ఢల్లీికి పిలిపించింది. ఆయనతో మాట్లాడిన తర్వాత ? గవర్నర్‌ కు పిలిచారు తమిళిసై ఢల్లీి వెళ్లి పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్కారు. ఏదైనా ? బీఆర్‌ఎస్‌ బండి సంజయ్‌ అరెస్టుతో బీజేపీని మరింత రెచ్చగొట్టిందన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *