పవన్-సాయితేజ్ ద్వయం పోస్టర్.. ఫ్యాన్స్‌కి ఈ భరోసా చాలు!

మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej) మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ (Bro). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై జీ స్టూడియోస్‌ (ZEE Studios)తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ద్వయం కలిసున్న పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

‘బ్రో ద్వయం’ (#BroTheDuo) పేరుతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసున్న ఈ పోస్టర్‌ను మే 29న ఉదయం 10:08 గంటలకు విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బైక్ మీద ఒక కాలు పెట్టి పవన్ కళ్యాణ్ నిల్చొని ఉండగా, ఆయన మోకాలిపై చేతులు ఉంచి సాయి ధరమ్ తేజ్ నిల్చొని ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ చేతులపై పవన్ కళ్యాణ్ చేయి ఉండటం చూస్తుంటే ‘నేనున్నాను అనే భరోసా’ ఇస్తున్నట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ కంటిచూపుతోనే దేన్నైనా శాసించగలరనే అంతలా శక్తివంతంగా కనిపిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ముఖంలో మాత్రం సున్నితత్వం ఉట్టిపడుతోంది. మొత్తానికి మామ-అల్లుడు ద్వయం పోస్టర్, సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేదిగా ఉంది.

బ్రో’ (#BroTheAvatar) విషయానికి వస్తే.. మే 18న టైటిల్‌ని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం.. బ్రో బ్రోవగ ధర్మశేషం.. బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం’ అనే శ్లోకంతో పవన్ కళ్యాణ్ పాత్రను పరిచయం చేసిన తీరు కట్టిపడేసింది. అలాగే మే 23న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ పోషిస్తున్న మార్క్ అలియాస్ మార్కండేయులు పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి కూడా విశేష స్పందన లభించింది. ‘బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం.. బ్రోదర చిద్విలాసం’ అనే శ్లోకంతో శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో ఆయన పాత్రను పరిచయం చేశారు. తాజాగా విడుదల చేసిన ‘బ్రో ద్వయం’ పోస్టర్ ఆ రెండు పోస్టర్లను మించేలా ఉండటమే కాకుండా.. సినిమా అద్భుతంగా ఉండబోతుందనే భరోసాని ఫ్యాన్స్‌కి కలగజేస్తోంది. కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, సముద్ర ఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2023, జూలై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *