తెలంగాణలో మారుతున్న ట్రెండ్స్‌..

రాష్ట్రంలో రాజకీయ ట్రెండ్‌లు క్రమంగా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నాళ్లు బీఆర్‌ఎస్‌?వర్సెస్‌?బీజేపీ అనే స్థాయిలో ఫైట్‌ కొనసాగింది. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్‌?గ్రాఫ్‌?పెరిగింది. ఇప్పుడు బీఆర్‌ఎస్‌?వర్సెస్‌?కాంగ్రెస్‌?అనే స్థాయిలో రాజకీయం కొనసాగుతున్నది.బీఆర్‌ఎస్‌?పార్టీ కూడా బీజేపీని లైట్‌ తీసుకొని, కాంగ్రెస్‌పై ఫోకస్‌ పెంచింది. హస్తం పార్టీకి పోటీగా గులాబీ నేతలు రాజకీయ ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరుగుతున్న సభలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్‌?పార్టీ సభలను గమనిస్తున్న బీఆర్‌ఎస్‌, నిర్లక్ష్యం వహిస్తే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని గ్రహించింది.గతంలో పోల్చితే కాంగ్రెస్‌?పార్టీ సభలకు జనాలు స్వచ్ఛందంగా రావడం షురూ అయింది. దీంతో కాంగ్రెస్‌?వేవ్‌ను అడ్డుకునేందుకు స్వల్ప వ్యవధితోనే బీఆర్‌ఎస్‌?కూడా అదే ప్రాంతాలలో రాజకీయ సభలు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నది. గడిచిన రెండు నెలలుగా రాష్ట్రంలో ఇదే కొనసాగుతున్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సభలు, స్ట్రీట్‌?కార్నర్‌?విూటింగ్‌లు నిర్వహించిన కొద్ది రోజుల్లోనే బీఆర్‌ఎస్‌?ఆ ఏరియాలో సభ పెట్టి జనాలకు మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నది.కాంగ్రెస్‌?వైపు జనాలు మళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. స్వయంగా కీలక మంత్రులు హరీష్‌?రావు, కేటీఆర్‌లు కాంగ్రెస్‌?వెనక బీఆర్‌ఎస్‌ సభలకు ప్లాన్‌?చేయడం గమనార్హం. అధికార పార్టీగా ఉండి నష్టపోతామనే ఇండికేషన్‌తోనే ఆ ఇద్దరు మంత్రులు రాజకీయ సభలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. గత నెల 24వ తేదిన కాంగ్రెస్‌?పార్టీ ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇల్లందు క్రాస్‌ రోడ్‌ నుంచి మయూరి సెంటర్‌ పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ తీసి జనాలను ఆకట్టుకున్నది. ఆ తర్వాత మయూరీ సెంటర్‌ వద్ద స్ట్రీట్‌ కార్నర్‌ విూటింగ్‌ను ఏర్పాటు చేయగా, దాదాపు 50 వేల మందికి పైగా వచ్చినట్లు కాంగ్రెస్‌?నేతలు ప్రచారం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌?పార్టీ గ్రాఫ్‌?పెరిగిందని గ్రహించిన బీఆర్‌ఎస్‌.. వెంటనే మంత్రి పువ్వాడ అజయ్‌?ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రత్యేక సభను నిర్వహించారు. కాంగ్రెస్‌?పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఏప్రిల్‌ 26 కాంగ్రెస్‌?పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో నిరుద్యోగ నిరసన ప్రదర్శన జరిగింది. కలెక్టరేట్‌ చౌరస్తా నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ తీసి, అంబేద్కర్‌ చౌరస్తా వద్ద స్ట్రీట్‌ కార్నర్‌ విూటింగ్‌ను ఏర్పాటు చేశారు.ఇది జరిగిన ఒకటి రెండ్రోజుల్లో బీఆర్‌ఎస్‌?పార్టీ ఇన్‌?చార్జీ మంత్రి ఇంద్రకరణ్‌?రెడ్డి, ఇతర సీనియర్‌?నాయకుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక సభను ఏర్పాటు చేసి, కాంగ్రెస్‌ను డైవర్షన్‌?చేసేందుకు ప్రయత్నం చేశారు. ఏప్రిల్‌ 28న కాంగ్రెస్‌? ఆధ్వర్యంలో నల్లగొండలో నిరుద్యోగ నిరసన ప్రదర్శన జరిగింది. నల్లగొండ క్లాక్‌ టవర్‌ వద్ద స్ట్రీట్‌ కార్నర్‌ విూటింగ్‌ ఆధరణ పెరిగింది. దీన్ని గమనించిన ఆ జిల్లా మంత్రి జగదీష్‌?రెడ్డి హై కమాండ్‌ ఆదేశాలతో సూర్యాపేట్‌, నల్లగొండ, మిర్యాలగూడలో బీఆర్‌ఎస్‌?పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహించారు.ఏప్రిల్‌ 30 మహబూబ్‌ నగర్‌లో కాంగ్రెస్‌?పార్టీ నిరుద్యోగ నిరసన ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత వెంటనే మంత్రి కేటీఆర్‌?ఈ నెల 6 మహబూబ్‌?నగర్లో ఐటీ టవర్‌?ప్రారంభోత్సవం చేసి రాజకీయ విమర్శలు చేశారు. ఈ సభలో మంత్రి శ్రీనివాస్‌?గౌడ్‌?టీపీసీసీ చీఫ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక వరంగల్‌, ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌ లో కాంగ్రెస్‌?పార్టీ ర్యాలీలు, సభలు నిర్వహించిన అనంతరం మంత్రి హరీష్‌?రావు, కేటీఆర్‌లు అభివృద్ధి పేరిట రాజకీయ ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రెండేళ్ల నుంచి బీజేపీపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చేసిన బీఆర్‌ఎస్‌?రెండు నెలల నుంచి ఆ పార్టీని పల్లెత్తు మాట అనకపోవడం గమనార్హం. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, సర్పంచ్‌ల నుంచి మంత్రుల వరకు కాంగ్రెస్‌?పార్టీపైనే రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌?కేడర్‌?బలోపేతం అవడంతో పాటు, కర్ణాటక రిజల్ట్స్‌తో బీఆర్‌ఎస్‌?పార్టీలో కాస్త అలజడి మొదలైందని, అందుకే కాంగ్రెస్‌పైనే బీఆర్‌ఎస్‌?ఎక్కువ ఫోకస్‌?పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *