నైజీరియాలో మూడు బస్సులు ఢీ…37 మంది మృతి

నైజీరియా(Nigeria) దేశంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈశాన్య మైదుగురి నగరం వెలుపల మూడు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 37 మంది మరణించారు.రెండు వాణిజ్య బస్సులు ఢీకొనడంతో(Buses Collides) మంగళవారం ఈ ప్రమాదం జరిగిందని, మూడో బస్సు వాటిపైకి దూసుకెళ్లేలోపే మంటలు చెలరేగాయని బోర్నో రాష్ట్రానికి చెందిన రోడ్డు భద్రతా సంస్థ అధిపతి ఉట్టెన్ బోయి తెలిపారు.

మృతదేహాలు కాలిపోయి గుర్తు పట్టలేని విధంగా మారాయి.బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి వెలుపల 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జకానా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.బస్సు ఒక టైరు పగిలిపోవడంతో మరో బస్సు ఢీకొట్టింది. ఆ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ బస్సుల ప్రమాదానికి మితిమీరిన వేగం కారణమని బోయి చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *