సౌరవ్ గంగూలీపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్..

ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు (GTvsRCB) తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోహ్లీ (Virat Kohli), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత శతకాలతో ఆకట్టుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తరఫున కోహ్లీ సెంచరీ చేశాడు. తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తరఫున గిల్ శతకం సాధించాడు. గిల్ సెంచరీతో గుజరాత్ విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇంటి దారి పట్టింది.

విరాట్ కోహ్లీకి ఈ ఐపీఎలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) ఆటగాళ్లతో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ టీమ్ బౌలర్ నవీన్-ఉల్-హక్, మెంటార్ గౌతమ్ గంభీర్‌తో కోహ్లీ గొడవ పడ్డాడు. దీంతో కోహ్లీని వారిద్దరూ టార్గెట్ చేశారు. కోహ్లీని తక్కువ చేస్తూ లఖ్‌నవూ టీమ్ కూడా ట్వీట్ చేసింది. తాజాగా మాజీ దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కూడా ఆ మ్యాచ్ గురించి ఓ ట్వీట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించిన గిల్‌ను ఆకాశానికెత్తేశాడు. వరుసగా రెండు సెంచరీలు సాధించిన గిల్‌పై ప్రశంసలు కురిపించాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *