ముగ్గురు పిల్లలతో కలిసి నీళ్లట్యాంకులోకి దూకిన మహిళ

హర్యానా (Haryana)రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. హర్యానా రాష్ట్రంలోని ఓ గ్రామంలో మంగళవారం ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి వాటర్ ట్యాంక్‌లోకి దూకింది.(Woman Jumps) ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు(Kids) మరణించారని పోలీసులు తెలిపారు. మహిళ ప్రాణాలతో బయటపడి ప్రాణాపాయ స్థితిలో ఉంది.నుహ్ జిల్లాలోని ఖేర్లా గ్రామానికి చెందిన షాకునత్ అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి నీళ్ల ట్యాంకులోకి(Water Tank) దూకింది. పిల్లలు కేకలు వేయడం విన్న ఇరుగుపొరుగు వారు మహిళ ఇంటికి చేరుకుని వారిని బయటకు తీశారు. కానీ అప్పటికే ముగ్గురు పిల్లలు మరణించారని పోలీసులు తెలిపారు.

షాకునత్ ఆత్మహత్య చేసుకునేందుకు ట్యాంక్‌లోకి దూకినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో మృతి చెందిన చిన్నారులు షబానా(10), సాద్ (8), నాలుగు నెలల ఇక్రార్ లుగా గుర్తించారు.ఈ ఘటన జరిగిన సమయంలో షాకునత్ 12 ఏళ్ల కుమారుడు పాఠశాలలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.భర్త మహ్మద్ ఆరిఫ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *