సాయి ధరమ్ తేజ్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘విరూపాక్ష’ (Virupaksha) బాక్స్ ఆఫీస్ ని (Box Office) షాక్ చేసే పడేస్తోంది. మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ తో విడుదల అయిన ఈ సినిమా రెండో రోజు, మూడో రోజు కల్కేషన్స్ కూడా అదిరిపోయి అయి. ఒక టైం లో అయితే బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘వీరసింహా రెడ్డి’ (Veerasimha Reddy) కలెక్షన్స్ కూడా అధిగమించి మరీ దూసుకుపోతోంది. కార్తిక్ దండు (Karthik Dandu) మొదటి సారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటించింది. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ (BVSN Prasad) దీనికి నిర్మాత. #VirupakshaCollections

మొదటి రోజు కన్నా, రెండో రోజు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చాయి. రెండో రోజు రూ.5.80 కోట్లు కలెక్టు చెయ్యగా, మూడో రోజు రూ. 5.77 కొట్లాడు కల్కేక్టు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సంచలన సృష్టించింది ఈ ‘విరూపాక్ష’. #Virupaksha ఇవి కేవలం ఈ రెండు రాష్ట్రాల్లో కలెక్షన్స్ మాత్రమే. మూడు #SaiDharamTej రోజులకు గాని మొత్తం రెండు రాష్ట్రాల్లో రూ. 16.36 కోట్ల షేర్ కలెక్టు చేసి ఈ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కి ఈరోజు నుండి బ్రేక్ ఈవెన్ అవుతుందని కూడా ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

ఇంకో విషయం ఏంటి అంటే, బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ రెండో రోజు రూ.5.12 కోట్ల షేర్ మాత్రమే కలెక్క్ట్ చేస్తే, సాయి ధరమ్ తేజ్ సినిమా ఇంకా ఎక్కువ కలెక్టు చేసింది. బాలకృష్ణ సినిమా పండగ రోజుల్లో విడుదల అయింది. ఇక్కడ విషయం ఏంటి అంటే కంటెంట్ కింగ్ అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

ఈ సినిమా నిర్మాతలకి మంచి లాభాలను తెచ్చి పెడుతుంది అనటంలో సందేహం లేదు. ఈ సినిమాకి అగ్ర దర్శకుడు సుకుమార్ (Sukumar) స్క్రీన్ ప్లే ఇవ్వటం ఆసక్తికరం. అతను కూడా ఇందులో నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకి నేపధ్య సంగీతం, ఛాయాగ్రహణం రెండు పిల్లర్స్ లా నిలుచున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *