వంద రోజుల్లో డబుల్‌ ఇస్మార్ట్‌

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న సీక్వెల్‌ మూవీ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు. సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదనీ, 2024 మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలు స్సష్టం చేశారు. ఈ సందర్భంగా వంద రోజుల కౌంట్‌ డౌన్‌ పోస్టర్‌ను విడదుల చేశారు. మాసివ్‌ అవతార్‌లో రామ్‌ పోతినేని ఈ పోస్టర్‌లో కనిపించారు. జీన్స్‌, షర్ట్‌ ధరించి తుపాకీ పట్టుకొని టెర్రిఫిక్‌గా కనిపించారు. ఆయన వెనుక చాలా వెపన్స్‌ ఉన్నాయి. సినిమాలో చూడబోయే మాస్‌, యాక్షన్‌ వైబ్‌ని ఈ పోస్టర్‌ సూచిస్తోంది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌, ఛార్మీ కౌర్‌ నిర్మిస్తున్నారు.తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ విడుదల కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *