తెలంగాణలో పొలిటికల్ క్లౌడ్ బరస్ట్
గోదావరి వరదల వెనక కుట్ర ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమయ్యాయి. క్లౌడ్ బరస్ట్పై సీఎం కేసీఆర్ వ్యక్తంచేసిన అనుమానాలుపై ఓ వైపు సీరియస్ చర్చ జరుగుతోంది.గోదావరి వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ తుపాను రేపాయి. గోదావరి వరదల వెనక కుట్ర ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమయ్యాయి. క్లౌడ్ బరస్ట్పై సీఎం కేసీఆర్ వ్యక్తంచేసిన అనుమానాలుపై ఓ వైపు సీరియస్ చర్చ జరుగుతోంది. క్లౌడ్ బరస్ట్ సాధ్యసాధ్యాలు, గతంలో ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా? అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై పొలిటికల్ రియాక్షన్స్ దూసుకొస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ నాయకులు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏదో రూపంలో స్పందించాల్సిన పరిస్థితి తలెత్తింది. కొందరు అవునా అంటూ సమాధానమిస్తుండగా.. ఇంకొందరు కేసీఆర్ వ్యాఖ్యలు వినలేదంటూ తప్పించుకుంటున్నారు.తెలంగాణలో మాత్రం క్లౌడ్ బరస్ట్ పై పొలిటికల్ క్లౌడ్స్ క్యుమిలోనింబస్ను మించి కమ్మేశాయి. క్లౌడ్ బరస్ట్ చేసింది పాకిస్తానా? చైనానా సీఎం చెబితే బాగుంటుందని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. క్లౌడ్ బరస్ట్ చేయాలంటే ఎయిర్ బేస్ ఉండాలని.. గజ్వేల్లో సీక్రెట్గా ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు కొండా. లద్దాక్లో క్లౌడ్ బరస్ట్ సాధ్యమేనని.. అయితే అక్కడ జరిగిందో లేదో తనకు తెలియదన్నారు. అటు కేసీఆర్ వ్యాఖ్యలను కొట్టిపారేయకుండా.. దీనికి ఆధారాలు ఉంటే కేంద్రానికి ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ట్వీట్ చేశారు. కేసీఆర్ తగిన ఆధారాలు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపిస్తుందన్నారు.కావున, ఈ ఆందోళన కలిగించే తీవ్రమైన విషయంపై కేసీఆర్ గారి వద్దనున్న అన్ని ఆధారాలను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి అందించినట్లయితే, భారత ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపిస్తుందని తెలియజేస్తున్నాను.క్లౌడ్ బరస్ట్ అంటే గంటలో 10 సెంటీవిూటర్ల వర్షపాతం పడుతుందని.. రోజల తరబడి వర్షాలు ఉండవన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మాజీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. ఉత్తరాఖండ్లో కూడా క్లౌడ్ బరస్ట్ జరగలేదంటున్నారు మర్రి. కేసీఆర్ డైవర్ట్ రాజకీయాలు చేయగలరని మరోసారి నిరూపించారని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు.అటు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రొ.కోదండరామ్ కూడా రియాక్ట్ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో వరదలను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని క్లౌడ్ బరస్ట్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశీ శక్తుల హస్తముందని సీఎం కేసీఆర్ పేర్కొనడం అవివేకమన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే కాళేశ్వరం పంపింగ్ హౌస్ మోటార్లు మునిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన అంచనాలు లేకుండా ప్రాజెక్టును కట్టడమే అందుకు కారణమని వివరించారు. ఈ అంశంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.వరద పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటో కానీ.. విపక్షాలు, సోషల్ విూడియా వేదికగా నెటిజన్లు మాత్రం రెండు వర్గాలుగా మారిపోయి పరస్పర మాటలయుద్ధానికి దిగుతున్నారు. కౌంటర్లు.. ఎన్కౌంటర్లతో పొలిటికల్ క్లౌడ్స్ అందరిలో ఆవహించాయి.
తప్పు పట్టిన కోదండరామ్
క్లౌడ్ బరస్ట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రొఫెసర్ కోదండరామ్ తప్పుబట్టారు. భారీ వర్షాలకు విదేశీ కుట్ర అంటూ సీఎం కామెంట్లు అవివేకమని మండిపడడ్డారు. క్లౌడ్ సీడిరగ్ కు ఇప్పటివరకు శాస్త్రీయత లేదన్నారు. ముందు చూపుతో వ్యవహరించి నదీ నీటి నిర్వహణను ప్లాన్ చేయాలని సూచించారు. అలా చేయకపోవడం వల్లే బ్యాక్ వాటర్ తో ఎక్కువ ప్రాంతాలు మునిగాయని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యంతోనే కాళేశ్వరం పంపింగ్ హౌస్ మోటార్లు మునిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన అంచనాలు లేకుండా ప్రాజెక్టును కట్టడమే అందుకు కారణమని వివరించారు. ఈ అంశంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరిగా లేదన్న కోదండరామ్.. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మరిన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఆందోళన చెందారు. పోలవరం బ్యాక్ వాటర్ మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని స్పష్టం చేశారు.కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య ఈ వ్యాఖ్యలను ఖండిరచారు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా మాట్లాడడం సరికాదని సూచించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాలను చూడడానికి వెళ్లిన మరో నేత పొన్నాల లక్ష్మయ్య.. కాళేశ్వరం మానవ తప్పిదం కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం వద్ద 12లక్షల క్యూసెక్కుల నీరు ఉన్నప్పుడే పంప్హౌస్లు ఎలా మునుగుతాయని నిలదీశారు.కాగా.. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి ఏదో వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఏవో కుట్రలున్నాయని చెబుతున్నారన్న సీఎం.. ఎంత వరకు కరెక్టో తెలియదని చెప్పారు. ఇతర దేశాల వాళ్లు కావాలనే మన దేశంలో అక్కడక్కడా క్లౌడ్బరస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు