అప్పుడు కూల్చివేతలు.. ఇప్పుడు అమ్మకాలు
హైదరాబాద్, జూన్ 29
హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు అత్యంత సవిూపంలోని రూ. వేల కోట్ల విలువైన వందలాది ఎకరాల గురుకుల్ ట్రస్ట్ భూములు ఉన్నాయి. ఇక్కడ యథాతథ స్థితి ఉన్నా.. ఎత్తైన భవనాలు లేస్తూనే ఉన్నాయి. సైబర్ టవర్స్ నుంచి రైల్వే ట్రాక్ వరకు ఈ దందా నడుస్తూనే ఉన్నది. ఇదిలా ఉంటే… దశాబ్దాలుగా ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన 2,892 మంది యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొందరేమో పరిస్థితులు ఎలా ఉంటాయోనని నాయకులు, రియల్టర్ల ఒత్తిళ్ల మేరకు అగ్గువ ధరలకే అమ్ముకొని వెళ్లిపోతున్నారు.తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 21 రోజులకే సీఎం కేసీఆర్ గురుకుల్ ట్రస్ట్ భూములపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో 2014 జూన్ 23న 24 బహుళ అంతస్తుల భవనాలను కూల్చారు. 11 భవనాలకు తాళాలు వేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ కొద్ది రోజులకే అంతా గప్ చుప్ అయ్యారు. అయితే అప్పుడు కూల్చిన భవనాలు మళ్లీ లేచాయి. ఇప్పుడు మరింత ఎత్తులో దర్శనమిస్తున్నాయి. కాగా, కూల్చివేతలను అడ్డుకున్న ఆ అదృశ్య శక్తులెవరు? తొమ్మిదేండ్ల క్రితం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గురుకుల్ భూములు అసలు ఎవరివి? ఎందుకీ అక్రమాలు, అడ్డగోలు అనుమతి లేని భూములు? అప్పట్లో కూల్చిన భవనాలకు తిరిగి అనుమతులు ఇచ్చిందెవరు? వాటిని మొదట అగ్రిమెంట్ కుదుర్చుకొని అమ్మకాలు సాగించిన లీడర్లు ఎవరు? వీటన్నింటి వెనుక పెద్ద లీడర్ హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.వందల కోట్ల విలువైన భవనాల అనుమతులు, అక్రమాల కొనసాగింపు, యథేచ్ఛగా క్రయ విక్రయాలు.. వీటన్నింటి మధ్య చేతులు మారుతున్న సొమ్ము ఎవరికి చేరుతుందన్న చర్చ జోరుగా నడుస్తున్నది. గురుకుల్ ట్రస్ట్ భూములను కాపాడాలని, ఎలాంటి నిర్మాణాలు జరపకుండా చర్యలు తీసుకోవాలంటూ ట్రస్ట్ ఈవో ఏబీ రవీంద్రారెడ్డి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.2014 తర్వాత కూడా ట్రస్ట్ భూముల్లో పెద్దలే క్రయవిక్రయాలే అధికంగా చేశారు. చాలా మంది నోటరీల విూదనే కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుంటుందని భయపెడుతూ తక్కువ ధరలకే ప్లాట్లు సొంతం చేసుకుంటున్నారు. బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అనుమతులు లేకున్నా బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఇజ్జత్ నగర్ సర్వే నం.5/2 నుంచి 5/23 వరకు 167.11 ఎకరాలు, ఖానామెట్ సర్వే.11 నుంచి 15, 17, 19, 20, 22, 23, 26, 27, 29, 32, 34, 43, 44, 45, 46, 47, 48, 58, 59, 61, 64, 65 ల్లోని 410.14 ఎకరాలు(మొత్తం 577.25 ఎకరాలకు) గురుకుల్ ట్రస్టు అధ్యక్షుడు డిక్లరేషన్ ఇచ్చారు. అయితే 1975`76 పహాణీల్లో ఇజ్జత్ నగర్ సర్వే నం.12, 13 ల్లో పట్టాదారుడిగా రామస్వామి పేరుండడంతో ఈ భూమిని పరిగణనలోకి తీసుకోలేదు. మిగతా సర్వే నంబర్లలోని 23,38,073 చ.విూ.ల స్థలాన్ని తీసుకున్నారు. దర్యాప్తులో గురుకుల్ ట్రస్ట్ కొన్ని కో ఆపరేటివ్ సొసైటీలు, వ్యక్తులకు భూములను కేటాయించినట్లు తేలింది.అవన్నీ కూడా సేల్ డీడ్స్ ద్వారా జరిగాయి. సీలింగ్ యాక్టు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ అమ్మకాలు జరిగాయి. ట్రస్ట్ నిబంధనల ఉల్లంఘన జరగడంతో ప్రభుత్వం 2000లో జీవో నం.703 ద్వారా 1987 వరకు సాగిన క్రయ విక్రయాలు, జీపీఏలను రద్దు చేసింది. ఇది జీపీఏ పొందిన బి.కిషన్ లాల్, ఇతరులకు వర్తించింది. ఈ కారణంగా నిరభ్యంతర పత్రాలు జారీ చేయకపోవడంతో శ్రీస్వామి అయ్యప్ప కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ లిమిటెడ్ కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత గురుకుల్ ట్రస్ట్ తరపున కూడా పలు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి.గురుకుల్ ట్రస్ట్ భూములపై 2003, 2006 లలో జరిగిన సవిూక్షా సమావేశాల్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములుగా తేల్చారు. ఇతర శాఖల నుంచి వచ్చే అన్ని లిటిగేషన్లు, క్లెయిమ్స్ లను పక్కన పెట్టాలని తీర్మానించారు. ఈ భూముల వివాదాల పరిష్కారానికి అడ్వకేట్ జనరల్ లేదా సీనియర్ న్యాయవాదికి బాధ్యతలు అప్పగించి, ఈ స్థలాలపై వచ్చిన అన్ని యూఎల్సీ రెగ్యులరైజేషన్ పైళ్లను తిరస్కరించాలని, దేవాదాయ శాఖ చట్టాల ప్రకారం దరఖాస్తులన్నింటినీ రిజెక్ట్ చేయాలని అనుకున్నారు. దీని కోసం ప్రత్యేక రెగ్యులరైజేషన్ స్కీంను రూపొందించాలని అభిప్రాయపడ్డారు.దీంట్లో నివాసాలను, షెడ్లను, దుకాణాలను, సింగిల్ రూములను, బేస్మెంట్లను, ప్రహరీలను కలిగిన వాటితో పాటు రిజిస్టర్ సేల్ డీడ్ కలిగిన ప్లాట్లను క్రమబద్ధీకరించాలని అధికారులు సూచించారు. ఆఖరికి కమర్షియల్, ఇండస్ట్రియల్, బిజినెస్ కేంద్రాలకు కూడా వర్తిస్తుందని వెల్లడిరచారు. క్రమబద్ధీకరణ ఎలా ఉండాలన్న దానిపై అధికారుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ రేట్లను నిర్ణయించాలని పేర్కొన్నారు.స్థల వినియోగం తరహాను బట్టి రేట్లను ప్రకటించాలని సమావేశాల్లో స్పష్టం చేశారు. నేషనల్ అకాడవిూ ఆఫ్ కన్ స్ట్రక్షన్, హైటెక్స్ లకు కేటాయించిన స్థలాలను కూడా క్రమబద్ధీకరించాలని, మిగతా స్థలాన్ని హుడాకు కేటాయించాలని, ఈ క్రమంలో గురుకుల్ ట్రస్టు కార్యకలాపాల కోసం ఆర్థిక తోడ్పాటు నందించాలని ఉన్నత స్థాయి అధికారుల కమిటీ అభిప్రాయపడిరది. దీని ప్రకారం 2006లో జీఓ నం.1483 ద్వారా రంగారెడ్డి కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్, హుడా వైస్ చైర్మన్ లేదా స్పెషల్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా క్రమబద్ధీకరణకు రేట్లను ప్రతిపాదించాలి.కానీ నేటి వరకు ఈ కమిటీ అలాంటి ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదు. అయితే యూఎల్సీ పరిధిలోని స్థలాల క్రమబద్ధీకరణకు 2008 జూన్ 18న జీఓ 747 ను జారీ చేశారు. దాని ప్రకారం గురుకుల్ ఘట్ కేసర్ ట్రస్టు నుంచి ఖానామెట్, ఇజ్జత్ నగర్ ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసి, సేల్ డీడ్స్ కలిగిన 2,737 మంది ఫీజులు కట్టి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి 23,16,839 చ.విూ. స్థలం సీలింగ్ కు మించి ఉందని తేల్చారు. ఈ సర్ ప్లస్ స్థలాన్ని 2006 ఏప్రిల్ 19న స్వాధీనం చేసుకున్నారు.
? ఇజ్జత్ నగర్ లో సర్వే నెం.5/2 నుంచి 5/12, 5/14 నుంచి 5/24, ఖానా మెట్ సర్వే నం.11, 14, 15, 17, 22, 23, 26, 27, 29, 32, 34, 44, 45, 46, 47, 48, 58, 59, 61, 64, 65 వరకు 572.18 ఎకరాలు.
? ఏపీఐఐసీకి కేటాయించినది: 27.27 ఎకరాలు
? ఎన్ఐసీకి కేటాయించినది: 167.11 ఎకరాలు
? ఇంకా మిగిలిన భూమి: 377.33 ఎకరాలు
? రోడ్లకు పోయిన భూమి: 113.14 ఎకరాలు
? రోడ్లకు పోగా మిగిలిన భూమి: 264.19 ఎకరాలు
? గురుకుల్ ట్రస్ట్, అయ్యప్ప సొసైటీ భూములు: 363.08 ఎకరాలు(దరఖాస్తుల సంఖ్య: 2892)
? జీవో నం.747 కింద అందిన నిధులు గురుకుల్ ట్రస్ట్ భూములకు సంబంధించినవు: రూ.56.67 కోట్లు
? అయ్యప్ప సొసైటీ భూములకు సంబంధించినది: రూ.22.21 కోట్లు.
?యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ జీఓ 747 కింద సదరు దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు వివిధ కోర్టుల్లో ఉన్న పలు పెండిరగ్ కేసులు అడ్డొచ్చాయి.
కోర్టు సూచనలు
` రిట్ పిటిషన్ నం.29407/2008, 9714, 16658/2009లకు సంబంధించిన కేసుల్లో ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది.
` గురుకుల్ ట్రస్టు భూములు థర్డ్ పార్టీ ఆక్రమించుకున్నది. 1972?73 పహానీ ప్రకారం సర్వే నం.43లోని 12 ఎకరాల్లో మాత్రం కాలమ్ నం.16లో ఓరుగంటి గండయ్య, ఓరుగంటి లింగయ్య, కటికె రామయ్య పేర్లు ఉన్నాయి. సర్వే నం.44(3.27 ఎకరాలు), 45(2.24 ఎకరాలు), 46(5.09 ఎకరాలు), 48(3.18 ఎకరాలు), 58(1.28 ఎకరాలు), 61(1.11 ఎకరాలు), 64(1.35 ఎకరాలు) పూర్తిగా గురుకుల్ భూములుగానే పేర్కొన్నారు. కాలమ్ నం.16లో ఎవరి పేర్లు లేవు.
` సదరు స్థలాల్లో నిర్మాణాలు వెలిశాయి. అందుకే దానికి బదులుగా మరో చోట ట్రస్టుకు స్థలాన్ని కేటాయించాలి.
` ఆక్రమణ స్థలాల్లో నిర్మాణాలను, ప్లాట్లను అనుభవిస్తున్న వారికి ప్రత్యేక క్రమబద్ధీకరణ స్కీంను రూపొందించాలి. థర్డ్ పార్టీలకు, హౌసింగ్ సొసైటీలకు, వెల్ఫేర్ అసోసియేషన్ కోసం ఈ స్కీంను అమలు చేయాలి.` ఆ తర్వాత ప్రభుత్వం దానిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఆపై 2013లోనూ సుప్రీం కోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఈ భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని స్టేటస్ కో జారీ చేసింది. ఇక ప్రభుత్వం చేతిలోనే నిర్ణయం ఉంది.