మచ్చలేని నిస్వార్ధ నాయకుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి నేడు

బాబూ జగ్జీవన్‌ రామ్‌ ది ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం.. మూడు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రి? ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడు,,. దళితుల హక్కుల కోసం పోరాడిన యోధుడు? వివక్ష వ్యతిరేక పోరాటంలో అంబేద్కర్‌ కు సరిసమానుడు? ఆయనే బాబూ జగ్జీవన్‌ రామ్‌.బాబూజీగా అందరూ పిలుచుకునే జగ్జీవన్‌ రామ్‌.. 1908 ఏప్రిల్‌ 5న బీహార్‌ లోని చాండ్వాలో జన్మించారు. స్కూలు స్థాయిలోనే.. దళితుగా వివక్షను ఎదుర్కొన్నారు. దీంతో.. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని దళితుల హక్కుల కోసమే అంకితం చేశారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో, సామాజిక ఉద్యమాల్లో పనిచేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా పోరాడారు. పార్లమెంటరీ సెక్రటరీ స్థాయి నుంచి? దేశ ఉప ప్రధాని వరకు అనేక పదవులు నిర్వహించారు. మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగారు. అణగారిన కులాలకు ఓటు హక్కు కోసం, కనీస వేతన చట్టం అమలు కోసం ఆయన కృషి చేశారు. విద్యార్థి దశనుంచే గాంధీజీ అహింసా మార్గాన్ని ఫాలో అయ్యారు జగ్జీవన్‌ రామ్‌. 1930లో.. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. 27 ఏళ్ల వయసులోనే 1935 లో.. బీహార్‌ శాసనమండలి సభ్యుడిగా పొలిటికల్‌ కెరీర్‌ ను ప్రారంభించారు. స్వాతంత్య్రానికి ముందు ఏర్పడిన నెహ్రూ ప్రభుత్వంలో.. యంగెస్ట్‌ మినిస్టర్‌ గా ఉన్నారు. తర్వాత తొలి కేబినెట్‌ లో లేబర్‌ మినిస్టర్‌ గా పనిచేశారు. 1947లొ జెనీవాలో? ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు. 1971లో భారత్‌`పాక్‌ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలొ హరిత విప్లవం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్‌ కు, ఇందిరాగాంధీకి విధేయుడిగా ఉన్నారు జగ్జీవన్‌ రామ్‌. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని సపోర్ట్‌ చేశారు. 1977లొ కాంగ్రెస్‌ ను విడిచిపెట్టి కాంగ్రెస్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీని స్థాపించారు. తర్వాత దాన్ని జనతా పార్టీలో విలీనం చేశారు. 1977 నుంచి 79 వరకు మొరార్జీ దేశాయ్‌ హయాంలో ఉపప్రధానిగా పనిచేశారు. తొలి దళిత ఉప ప్రధానిగా రికార్డు సృష్టించారు. 1936 నుంచి 1986 వరకు పార్లమెంట్‌ సభ్యుడిగా కొనసాగి.. వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. 30 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా పనిచేయడం కూడా ఒక రికార్డే. ఎన్ని పదవులు అలంకరించినా? ప్రధాని పీఠాన్ని ఎక్కాలన్న ఆయన కల.. కలగానే మిగిలిపోయింది. చేతికి అందినంత దగ్గరకు వచ్చి.. అంతలోనే పీఎం పోస్టు దూరమైంది. 1979లో.. లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి మొరార్జీ దేశాయ్‌ బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉప ప్రధానిగా ఉన్న జగ్జీవన్‌ రామ్‌.. ప్రధాని అవుతారని అందరూ భావించారు. అయితే.. కొన్ని కారణాలతో చరణ్‌ సింగ్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అయ్యారు. జనతాపార్టీకి పార్లమెంటరీ పార్టీ నేతగానే జగ్జీవన్‌ రామ్‌ మిగిలిపోయారు. 78 ఏళ్ల వయసులో.. 1986 జులై 6న జగ్జీవన్‌ చనిపోయారు. 50 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో.. మచ్చలేని నాయకుడుగా పేరున్న ఆయన నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం. నిర్ణయాల్లో పరిపక్వత, కష్టాల్లో మొక్కవోని ధైర్యం, చర్చల్లో మేధావితనం వంటి లక్షణాలే జగ్జీవన్‌ రాంను విలక్షణ నాయకుణ్ణి చేశాయి. ప్రత్యర్ధులతో సైతం ఆకట్టుకోగల రాజనీతజ్ఞత, తర్కం, విషయ పరిజ్ఞానం ఆయన సొంతం. దళితులు జనజీవన స్రవంతికి దూరం కావడానికి ఇష్టపడని జగ్జీవన్‌ రామ్‌ సమానత్వం కోసం చివరి వరకు పోరాడిన యోధుడుగా చరిత్రలో నిలిచిపోయారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *