కలవరపెడుతున్న మంకీపాక్స్
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్లోని పలు దేశాల్లో 90కి పైగా మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడిరచింది.ఆఫ్రికాలో ఇది తరచూ కనిపించే అంటువ్యాధి. కానీ, ఇప్పుడు ఆఫ్రికాకు బయట ఇతర దేశాల్లో కనిపిస్తోంది. ఇవి కాక మరో 12 దేశాల్లో కనీసం 28 అనుమానిత కేసులను పరీక్షిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.అయితే, ఇది కోవిడ్ లాంటిది కాదని, దీని నియంత్రణ సాధ్యమేనని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు అంటున్నారు.ఈ వైరస్ ఎక్కువగా మధ్య, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా, వర్షాపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తుంది.డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. అక్కడ ఈ ఏడాది 1,200 కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మే 1 నాటికి 57 మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయి.ప్రారంభ దశలో జ్వరం, తలనొప్పి, వాపు, నడుం నొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.తరువాత, చర్మంపై దద్దుర్లు లేదా పొక్కులు కనిపిస్తాయి. ముందు చర్మం ఎర్రగా కందినట్టు అవుతుంది. ఆపై పొక్కులు వస్తాయి. తరువాత బొబ్బర్లుగా మారతాయి. ఆపై పెద్ద స్పోటకపు మచ్చల్లాగ ఏర్పడతాయని డబ్ల్యుహెచ్ఓ స్మాల్పాక్స్ సెక్రటేరియట్ హెడ్ డాక్టర్ రోసముండ్ లూయిస్ వివరించారు.మెల్లగా అవి ఎండిపోయి, పైన పొక్కులు ఊడిపోతాయని ఆమె చెప్పారు.దద్దుర్లు లేదా పొక్కులు దురద పెడతాయని, నొప్పిగా ఉండవచ్చని, కాలక్రమేణా దురదలు తగ్గుతాయని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీకి చెందిన డాక్టర్ అమేష్ అడాల్జా చెప్పారు.’’దద్దుర్లు, పొక్కులు తగ్గిపోతాయి. చాలామందికి త్వరగానే తగ్గిపోతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావు’’ అని ఆయన చెప్పారు.సాధారణంగా ఈ వ్యాధి 14 నుంచి 21 రోజుల లోపు దానంతట అదే తగ్గిపోతుంది.సాధారణంగా మంకీపాక్స్ కోతులు, ఎలుకలు, ఉడుతల వంటి జంతువుల నుంచి మానవులకు సోకుతుంది.మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు తక్కువ. కానీ, వైరస్ సోకిన వ్యక్తితో బాగా సన్నిహితంగా మెలిగితే ఇంఫెక్షన్ వ్యాపించవచ్చు.చర్మం పగుళ్లు, శ్వాసకోశ వ్యవస్థ, కళ్లు నోటి ద్వారా ఇది సంక్రమిస్తుంది.వ్యాధి ఉన్నవారు వాడిన తువ్వాళ్లు, దుప్పట్లు ఇతరులు వాడితే వ్యాధి సంక్రమించవచ్చు’’ఇది చాలా స్థిరమైన వైరస్’’ అని చెబుతూ, స్మాల్పాక్స్ అనేది డీఎన్ఏ వైరస్ అని, ఆర్ఎన్ఏ వైరస్ల కన్నా వీటిలో మ్యూటేషన్ చాలా తక్కువగా ఉంటుందని ఆమె వివరించారు. కోవిడ్ ఆర్ఎన్ఏ వైరస్ కుటుంబంలోకి వస్తుంది.మంకీపాక్స్ వైరస్లో మ్యూటేషన్ వచ్చిందన్న ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు. నిపుణులు ఆ దిశలో పరిశోధనలు చేస్తున్నారని లూయీస్ తెలిపారు.భారతదేశంలో 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాక, ఈ వ్యాధి పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. మంకీపాక్స్ అనేది అంటు వ్యాధి, వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి కారణంగా ఈ వ్యాధి నివారణ ,చికిత్సకు సంబంధించి అవకాశాలను కూడా అన్వేషిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా అల్లోపతితో పాటు హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేద సూత్రాలను చాలామంది ఫాలో అయ్యారు. అయితే ఇప్పుడు ప్రజలను టెన్షన్ పెడుతున్న మంకీపాక్స్ కి అల్లోపతి కాకుండా ఇతర వైద్య విధానాలలో నివారణ లేదా నివారణ చర్యలు ఉన్నాయోమో తెలుసుకుందాం.హోమియోపతి గురించి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతికి చెందిన మాజీ కన్సల్టెంట్, హోమియోపతి వైద్యుడు డాక్టర్ జాస్మిన్ సచ్దేవా మాట్లాడుతూ…’’ మంకీపాక్స్, కరోనా లేదా ఇతర వైరస్`సంబంధిత వ్యాధులను హోమియోపతితో మాత్రమే కాకుండా ఇతర వైద్య పరిస్థితులతో కూడా నయం చేయవచ్చు. అయితే అల్లోపతిలాగే రోగి యొక్క లక్షణాలను హోమియోపతిలో కూడా చికిత్స చేస్తారు. మంకీపాక్స్కు హోమియోపతిలో నిర్దిష్ట చికిత్స లేదు. మంకీపాక్స్లో జ్వరం, తలనొప్పి, కండరాలు, వెన్నునొప్పితో పాటు, ముఖం, నోటి లోపల, చేతులు, పాదాలు, ఛాతీ, మలద్వారం లేదా శరీరంలోని ఏదైనా భాగంలో బొబ్బలు వంటి లక్షణాలు రోగిలో కనిపిస్తాయని డాక్టర్ జాస్మిన్ సచ్దేవా చెప్పారు.అటువంటి పరిస్థితిలో హోమియోపతిలో ఈ లక్షణాలకు మందులు ఇవ్వబడతాయి. రోగి యొక్క ఈ లక్షణాలు పూర్తిగా నయం అయ్యే వరకు చికిత్స చేస్తారు. సాధారణంగా ఈ వ్యాధి 2 నుండి 4 వారాల వరకు ఉంటుంది. ఆ తర్వాత అది నయం అవుతుంది. మొటిమలు లేదా దద్దుర్లు వారి శరీరం నుండి పూర్తిగా నయమయ్యే వరకు రోగులు ఐసోలేషన్లో ఉండాలని డాక్టర్ సచ్దేవా చెప్పారు. ఈ సమయంలో, ఇతర వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా రోగి వద్దకు వెళ్లడానికి ప్రయత్నించాలని సూచించారు. కనీసం ఒక విూటరు దూరం పాటించాలన్నారు. మాస్క్ ధరించాలని, రోగి కూడా ధరించాలని తెలిపారు. రోగి బట్టలు, ఉపయోగించిన పరుపులు, వస్తువులను తాకవద్దని సూచించారు. ఇల్లు, చేతులను శానిటైజ్ చేస్తూ ఉండాలని సూచిస్తున్నారు