రామ్ చరణ్‌కు జోడిగా జాన్వీ కపూర్ నటించనుందా..?

శ్రీ దేవి కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’ సినిమాతో వెండితెరపైకి రంగ ప్రవేశం చేసింది. ‘గుంజన్ సక్సేనా’, ‘గుడ్ లక్ జెర్రీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది. చివరగా ‘మిలీ’ (Mili) లో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయినప్పటికి ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. జాన్వీకి సంబంధించిన ఓ అప్‌డేట్ ఫిలిం నగర్‌లో హల్‌చల్ చేస్తుంది. ఆమె త్వరలోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్‌గా ‘ఆర్‌సీ16’ (RC 16) అని వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలసి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియాగా పలు భాషల్లో రూపొందనుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామను తీసుకోవాలనే ఆలోచలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం అందుతుంది. రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70శాతానికి పైగా పూర్తయింది. ఇటీవలే ఓ పాటను న్యూజిలాండ్‌లో తెరకెక్కించారు. త్వరలోనే మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు రిలీజ్ డేట్‌ను ప్రకటించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *