ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో దూకుడు

విజయవాడ, అక్టోబరు 10
అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కామ్‌ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులుగా ఉండగా, మరో ఐదుగురి పేర్లను ఏపీ సీఐడీ తాజాగా నిందితులుగా చేర్చింది. ఈ నలుగురి పేర్లను సోమవారం చేరుస్తూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు ఏ ` 1గా, మాజీ మంత్రి పి. నారాయణ ఏ ` 2గా, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ ఏ ` 14గా ఉన్నారు. తాజాగా, నారాయణ భార్య రమాదేవిని ఏ ` 15గా, రావూరి సాంబశివరావు ఏ`16, ఏ ` 17గా ఆవుల మణిశంకర్‌, ఏ`18గా ప్రవిూల, వరుణ్‌కుమార్‌ కొత్తాపును ఏ ` 19గా సీఐడీ చేర్చింది. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి (ఏ`15)తో నారాయణ కాలేజీ ఉద్యోగి ధనుంజయ్‌ భార్య ప్రవిూల (ఏ ` 18), నారాయణ బంధువు ఆవుల మణి శంకర్‌ (ఏ ` 17), నారాయణ భార్య రమాదేవి బంధువు రాపూరి సాంబశివరావు (ఏ ` 16), వరుణ్‌ కుమార్‌ కొత్తాపు అనే వ్యక్తి పేర్లు కేసులో చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. క్రైం నంబర్‌ 16/2021 గా ఇప్పటికే ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. సెక్షన్‌ 120(ప), 409, 420, 166, 167, 34, 35, 37, 218 ఎఖఅ, 13(2), 13(1) ఆఫ్‌ పీసీ యాక్ట్‌ గా కేసు నమోదు చేసింది.ఈ కేసుకు సంబంధించి నారా లోకేష్‌కు, నారాయణకు విచారణకు తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు పిటిషన్‌ దాఖలు వేయగా.. ఏపీ హైకోర్టు నేడు ఆ పిటిషన్‌ను కొట్టేసిన సంగతి తెలిసిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *