దిల్ రాజుకి పితృ వియోగం, మెగాస్టార్ పరామర్శ

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి నిన్న రాత్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్ను మూసారు. సినిమా, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ఈరోజు దిల్ రాజు ఇంటికెళ్లి అతన్ని పరామర్శించి తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు.

నిన్న రాత్రి ప్రముఖ నిర్మాత దిల్ రాజు (DilRaju) తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి (86) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో అతనిని హైద్రాబాదులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు. ఆరోగ్యం క్షీణించి నిన్న రాత్రి కన్ను మూసారు. శ్యామ్ సుందర్ రెడ్డి స్వస్థలం నిజామాబాదు జిల్లాలోని, నర్సింగపల్లి. ఆయనకి దిల్ రాజుతో పాటు మరో ఇద్దరు కుమారులు వున్నారు.దిల్ రాజు ఇంట విషాదం చోటుచేసుకోవడంతో, సినిమా, రాజాకీయ రంగాలకు చెందిన పలువురు దిల్ రాజు ఇంటికి వెళ్లి అతనికి తమ సంతాపాన్ని తెలిపారు, శ్యామ్ సుందర్ రెడ్డి కి నివాళులు అర్పించారు. నటుడు నితిన్ (Nithin) తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి (SudhakarReddy) ఈరోజు ఉదయమే దిల్ రాజు ని కలిసి సంతాపాన్ని తెలియచేసారు. అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (PrakashRaj), సింగర్ సునీత (SingerSunitha), దర్శకుడు అనిల్ రావిపూడి (AnilRavipudi), నిర్మాత బండ్ల గణేష్ (BandlaGanesh) ఈరోజు ఉదయం దిల్ రాజు ని కలిసి తమ సంతాపాన్ని తెలియచేసారు.

మెగా స్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) ఈరోజు ఉదయం దిల్ రాజు ఇంటికి వెళ్లి అతనికి తన సానుభూతిని తెలియపరిచారు, శ్యామ్ సుందర్ రెడ్డి కి నివాళులు అర్పించారు.

కాంగ్రెస్ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ కి సన్నిహితుడు అయినా కేవీపీ రామచంద్ర రావు (KVPRamachandraRao) కూడా దిల్ రాజు ని కలిసి తమ సానుభూతిని వ్యక్త పరిచారు. తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (ErrabelliDayakaraRao) దిల్ రాజుని కలిసి తన సంతాపం తెలిపారు. జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ (PawanKalyan) ఒక అధికార ప్రకటనలో దిల్ రాజు కి సంతాపాన్ని తెలియచేసారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి పలువురు దిల్ రాజు తో ఫోనులో మాట్లాడి తమ సానుభూతిని వ్యక్తపరిచినట్టుగా కూడా తెలిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *