అల్లు అర్జున్, సుకుమార్ ల షాకింగ్ నిర్ణయం, సీక్వెల్ ఒక్కటే కాదు…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (AlluArjun) ఈరోజు ‘పుష్ప’ #Pushpa లో పుష్పరాజ్ #Pushparaj పాత్ర చేసినందుకు గాను రాష్ట్రపతి నుండి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకోనున్నారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ‘పుష్ప’ సినిమాకి సీక్వెల్ గా ‘పుష్ప 2’ #Pushpa2 కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండో పార్టు వచ్చే సంవత్సరం ఆగస్ట్ 15న విడుదల అవుతుందని ముందుగానే ప్రకటించారు.

ఇదిలా ఉండగా, దర్శకుడు సుకుమార్, కథానాయకుడు అల్లు అర్జున్ ఈ సినిమా గురించి ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక వార్త వినపడుతుంది. అదేంటి అంటే ఈ సినిమా రెండు పార్టులతోటే కాదు, ‘పుష్ప 3’ #Pushpa3 మూడో పార్టు కూడా ఉంటుంది అని. ఈ కథని చెప్పాలంటే రెండు పార్టులు సరిపోవు, అందుకని మూడో పార్టు కూడా తీయబోతున్నాం అని రెండో పార్టు చివర్లో చెప్తారు అని తెలిసింది.

అయితే ఈ మూడో పార్టు మాత్రం వెంటనే ఉండదు అని అంటున్నారు. ఎందుకంటే ‘పుష్ప 2’ తరువాత అల్లు అర్జున్ వేరే సినిమాలు ఒకటి రెండు చేసి, ఆ తరువాత మూడో పార్టుకు రావచ్చు అని తెలిసింది. సుకుమార్ కూడా వేరే వాళ్ళతో ఒక సినిమా చేసాక మళ్ళీ తరువాత ‘పుష్ప 3’ కోసం వస్తారు అని తెలిసింది. ఈ కథలో చాలా లోతు ఉందని, అందుకని ఎన్ని పార్ధులైన తీయొచ్చు అని, ఇప్పుడు చాలా సినిమాలు మూడు పార్టులుగా కూడా తీస్తున్నారు, అందుకని ‘పుష్ప 3’ కూడా ముందు ముందు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

రష్మిక మందన్న (RashmikaMandanna) ఇందులో కథానాయిక కాగా ఫహద్ ఫాజిల్ (FahadhFaasil), రావు రమేష్ (RaoRamesh), సునీల్ (Sunil), అనసూయ (Anasuya), జగపతి బాబు (JagapathiBabu) మున్నగు నటులు వున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *