తాటిపండ వంటకాలకు భలే..భలే

తాటి పండుతో వంటకాలు అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని దాని రుచి మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగని ఇదేదో పెద్ద ఖరీదైన పండు కాదండోయ్‌. విదేశాలనుండి వచ్చింది కూడా కాదు. మార్కెట్లో పెద్దగా లభ్యమయ్యేది కాదు. చెట్టు నుంచి పండిన తర్వాత సహజంగానే కింద పడుతుంది. ఆ పండు ఎంత రుచిగా ఉంటుందో.. ఆ పండుతో తయారు చేసిన వంటకాలు కూడా అంతే రుచిగానూ, అంతకంటే ఆరోగ్య ప్రధాయినిగానూ ఉంటుంది. అదే మన గ్రావిూణ పండు తాటిపండుమానవాళికి తాటి సంపద ఎంతో ప్రయోజనకరమైంది. ముంజలు, పండ్లు, తేగలు ఇలా అన్ని విధాలుగాను మనకు ఉపయోగపడుతుంది. మూడు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ తాటిపండుతో కడుపునింపుకునే వారు. నేరుగా కొందరు, వేడి చేసుకుని మరికొందరు ఈ పండును తినేవారు. అయితే చేతికి, మూతికి అంటుకుంటుందని క్రమేపీ దూరం పెడుతూ వస్తున్నారు. ప్రస్తుత సీజన్లో లభ్యమయ్యే తాటి పండు గురించి తెలుసుకోవడం ఆవశ్యకం. ఎందుకంటే ఇది ఎన్నో పోషకాలు కలిగి ఉంది. ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజంగ లభించే పండు ఇది. మగ్గడానికి రసాయనాలు వినియోగించే ప్రసక్తే లేదు. ఇప్పుడు గ్రావిూణ ప్రాంతాలలో మరీ ముఖ్యంగా కోనసీమ ప్రాంతాల్లో ఈ పండుతో తయారు చేసే వంటకాలకు డిమాండ్‌ పెరుగుతుంది. ఈ తాటి పండు గుజ్జు నుంచి తయారు చేసే గారెలు, బూరెలు, ఇడ్లీలు, దిబ్బరొట్టెలు వంటి ఎన్నో వంటకాలు రుచిచూడడానికి పోటీ పడుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఈ తాటిపండుతో తయారు చేసిన వంటకాలకు ప్రత్యేకం. అలసి పోయి ఇంటికి వచ్చిన ఇంటి పెద్దలకు.. స్కూల్‌ నుండి ఇంటికి వచ్చిన విద్యార్థులకు ఇంట్లో అమ్మ నాన్నమ్మలు చేసి పెట్టే వంటకమే తాటి పండు వంటకం. ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ సిటీలో కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక తాటి పండు ధర 30 నుంచి 40 రూపాయలు అమ్ముతున్నారు. ఇంకెందుకు ఆలస్యం విూరు కూడా వెళ్లి టేస్ట్‌ చేసేయండి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *