ఆర్ధికంలో బ్రైట్‌ స్పాట్‌ గా ఇండియా

ప్రస్తుత మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటూ మంచి వృద్ధితో ముందుకు సాగుతున్న దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇండియా మాత్రమే. ప్రపంచ ఆర్థికంలో ఓ బ్రైట్‌ స్పాట్‌ గా పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు భారత్‌ ను ప్రశంసలతో ముంచెత్తిన సంగతులు విన్నాం. అయితే 24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిపై తన అంచనాలను ప్రపంచ బ్యాంకు సవరించింది. భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ తగ్గించింది. అదే సమయంలో ప్రపంచ వృద్ధి పట్ల సానుకూల దృక్పథాన్ని కనబరిచింది. తాజా గ్లోబల్‌ ఎకనామిక్‌ ప్రాస్పెక్ట్స్‌ నివేదిక ప్రకారం.. జనవరిలో ప్రకటించిన మునుపటి అంచనా 6.6 శాతతో పోలిస్తే 24 ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ వృద్ధి కొద్దిగా మందగించి 6.3 శాతానికి పరిమితం అవుతుందని పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న రుణాల ఖర్చులు జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింంది. అయితే ఇప్పుడిప్పుడే ద్రవ్యోల్బణం గాడిలో పడటం, ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా 26 ఆర్థిక సంవత్సరం నాటికి వృద్ధి స్వల్పంగా మెరుగుపడుతుందని నివేదిక వెల్లడిరచింది. తలసరి జీడీపీ వృద్ధి పరంగా భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలుపుకోగలదని అంచనా వేసింది. గతేడాది 3.1 శాతం వృద్ధి అనంతరం 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన మందగమనాన్ని ఎదుర్కొంటుందని అంచనా వేయబడిరది. ఈ సమయంలో వృద్ధి అంచనా 2.1 శాతం మాత్రమే. అధిక ద్రవ్యోల్బణ రేట్లను అరికట్టే లక్ష్యంతో కొనసాగుతున్న ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడమే దీనికి కారణమని చెప్పవచ్చు. ప్రపంచ వృద్ధి రికవరీ అంచనాలు జనవరిలో 1.7 శాతం కాగా.. ప్రస్తుత అంచనాలు ప్రపంచ వృద్ధిని 2.4 శాతం వద్దకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.2023`24 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను ప్రపంచ బ్యాంకు 6.3 శాతానికి తగ్గించింది. గత జనవరిలో ప్రపంచ బ్యాంకు ప్రకటించిన అంచనా కంటే ఇది 0.3 శాతం తక్కువ. అయితే.. ప్రైవేట్‌ కన్‌జంప్షన్‌, పెట్టుబడుల్లో భారతదేశం హాట్‌ స్పాట్‌లో ఉందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. సేవల రంగం వృద్ధి కూడా బలంగా ఉందని చెప్పింది. 2022 ద్వితీయార్థంలో క్షీణత తర్వాత, 2023లో తయారీ రంగంలో పరిస్థితి మెరుగుపడుతోంది. ‘‘2023`24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు మరింత మందగించి 6.3 శాతానికి చేరుకుంటుందని అంచనా. ఇది, జనవరి అంచనా కంటే 0.3 శాతం తక్కువ’’ ` ప్రపంచ బ్యాంక్‌భారత్‌లో వృద్ధి రేటు మందగించడానికి అధిక ద్రవ్యోల్బణం, రుణ వ్యయాలు పెరగడం కారణమని, దీని వల్ల ప్రైవేట్‌ వినియోగంపై ప్రభావం పడుతుందని ప్రపంచ బ్యాంక్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది.వరల్డ్‌ బ్యాంక్‌ రిపోర్ట్‌ ప్రకారం, ‘‘భారత్‌లో వివిధ సంస్కరణలు అమలు చేస్తున్న నేపథ్యంలో, ఆశించిన స్థాయికి ద్రవ్యోల్బణం దిగి రావడం వల్ల 2025`26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి కొంతమేర పుంజుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు డ వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తుంది’’.2023 ప్రారంభంలో, భారతదేశ ఆర్థిక వృద్ధి మహమ్మారి ముందు దశాబ్దంలో సాధించిన స్థాయి కంటే తక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. అధిక ధరలు, పెరుగుతున్న అప్పుల వ్యయం కారణంగా ప్రైవేట్‌ పెట్టుబడులు ప్రభావితం కావడమే దీనికి కారణంగా వెల్లడిరచింది.గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్ట్స్‌పై తన తాజా నివేదికలో, 2022లో 3.1 శాతంగా ఉన్న ప్రపంచ వృద్ధి రేటు 2023లో 2.1 శాతానికి తగ్గుతుందని వరల్డ్‌ బ్యాంక్‌ వెల్లడిరచింది. చైనా మినహా, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు డ వర్ధమాన ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు గత సంవత్సరంలో నమోదైన 4.1 శాతం నుంచి ఈ సంవత్సరం 2.9 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇది, వృద్ధి రేటులో భారీ క్షీణతను చూపుతోంది.ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌గా కొత్తగా పగ్గాలు చేపట్టిన అజయ్‌ బంగా, ‘‘పేదరికాన్ని తగ్గించడానికి, సంపద పెంచడానికి ఖచ్చితమైన మార్గం ఉపాధి కల్పన. వృద్ధి మందగిస్తే ఉద్యోగాల సృష్టి కూడా కష్టమవుతుంది. వృద్ధి రేటు అంచనాలు ‘విధి రాత’ కాదని గమనించడం ముఖ్యం. దీనిని మార్చడానికి మనకు అవకాశం ఉంది. అయితే మార్పు కోసం మనమందరం కలిసి పనిచేయాలి’’ అని చెప్పారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా, భారత సంతతికి చెందిన అజయ్‌ బంగా గత శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *