కారు బీభత్సం?ముగ్గురు స్పాట్‌ డెడ్‌

విశాఖపట్నం
రిషికొండ సవిూపంలో రాడిసన్‌ బ్లూ హోటల్‌ వద్ద కారు అదుపు తప్పింది. రోడ్డు మద్యనున్న డివైడర్‌ ను ఢీకొంది. తరువాత ఒక చెట్టును గుద్దుకుని రోడ్డు అవతలికి దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని డీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్య భర్తలు పృధ్వీరాజ్‌, ప్రియాంకలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారులో వున్న ఒక వ్యక్తి మణికుమార్‌ కుడా కారులేనే మృతిచెందాడు. కారు ప్రయాణికులు ముగ్గురు పరారీలో వున్నారు. గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కారు సాగర్‌ నగర్‌ నుంచి ఎండాడ వైపు వెళుతున్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *