మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా..!

ఇండోనేసియా ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే షాక్‌ తిన్న ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు.. వేగంగా పుంజుకోవాలనుకుంటోంది. మంగళవారం నుంచి జరిగే మలేసియా ఓపెన్‌లో మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే తొలి రౌండ్‌లోనే థాయ్‌షట్లర్‌ పొర్న్‌పవే చోచువోంగ్‌ రూపంలో ఏడో సీడ్‌ సింధుకు గట్టి ప్రత్యర్థి ఎదురుకానుంది. గతంలో జరిగిన ముఖాముఖీ పోరులో 5-3తో సింధుదే పైచేయి.

కాగా, గాయాల కారణంగా కొన్ని టోర్నీలకు దూరమైన వెటరన్‌ సైనా నెహ్వాల్‌ మళ్లీ పోటీపడనుంది. మొదటి రౌండ్‌లో అమెరికా ప్లేయర్‌ ఐరిస్‌ వాంగ్‌తో సైనా ఆడనుంది. పురుషుల విభాగంలో హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ నిలకడైన ప్రదర్శనపై దృష్టి సారించగా.. సాయి ప్రణీత్‌, సమీర్‌ వర్మ, పారుపల్లి కశ్యప్‌ తిరిగి గాడిలో పడాలనే ప్రయత్నంలో ఉన్నారు. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి, అశ్వినీ పొన్నప్ప-సిక్కిరెడ్డి, మిక్స్‌డ్‌లో సుమీత్‌ రెడ్డి-అశ్వినీ పొన్నప్ప జంటలు టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *